News October 9, 2025
రాజగోపాల్ పేట: ముగిసిన టీజీఈపీసెట్ కౌన్సిలింగ్

ఈనెల 7న ప్రారంభమైన టీజీఈపీసెట్(బైపిసి)-2025 కౌన్సిలింగ్ నేటితో ముగిసిందని రాజగోపాల్ పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ గోవర్ధన్ తెలిపారు. మూడు రోజుల్లో మొత్తం 700 మంది విద్యార్థులు కౌన్సిలింగ్లో పాల్గొన్నారని తెలిపారు. వారి ధ్రువపత్రాలు పరిశీలన చేసి వెబ్ ఆప్షన్లకు సంబంధించిన సూచనలు ఇచ్చామని అన్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియలో అభినవ్, రాజు, రామకృష్ణ, షహబాజ్, విజయకుమార్ పాల్గొన్నారు.
Similar News
News October 10, 2025
అక్టోబర్ 10: చరిత్రలో ఈ రోజు

1906: రచయిత R.K.నారాయణ్ జననం
1954: బాలీవుడ్ నటి రేఖ జననం
1967: హాస్య నటుడు ఆలీ జననం
1973: దర్శకుడు రాజమౌళి(ఫొటోలో)జననం
1990: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జననం
2022: సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణం
✶ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
News October 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 10, 2025
పాలమూరు: కోర్టు స్టే.. కాంగ్రెస్ MLA కీలక వ్యాఖ్యలు

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టేను చూసి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆశావహులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇందుకు సంబంధించి పార్టీపరమైన స్పష్టత రెండు రోజుల్లో రాబోతోందని కాంగ్రెస్ నేత, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.