News October 9, 2025
వరంగల్: బాణసంచా విక్రయించేవారికి ALERT

వరంగల్ కమిషనరేట్ పరిధిలో దీపావళి సందర్భంగా బాణసంచా విక్రయించేవారు తప్పనిసరిగా టెంపరరీ లైసెన్స్ పొందాలని పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత జోనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) కార్యాలయంలో రూ.800 ఫీజు చెల్లించాలన్నారు. దీని కోసం ఫైర్ ఆఫీసర్ NOC, స్థల అనుమతి, షాప్ సైట్ ప్లాన్తో పాటు డాక్యుమెంట్లు సరిగా అందించాలన్నారు. ఈ నెల 16 వరకు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News October 10, 2025
పటాన్చెరు: రూ.18 కోట్లు మోసం చేసిన ఘరానా లేడి

విద్య అనే ఓ ఘరానా లేడీ తోటి మహిళకు రూ.18 కోట్ల మేర మోసం చేసిన ఘటన పటాన్చెరులో వెలుగు చూసింది. సికింద్రాబాద్లోని వారణాసిగూడకు చెందిన విద్య.. బంగారం తీసుకుని ఎక్కువ సొమ్ము చెల్లిస్తానని మోసం చేసి పటాన్చెరుకు మకాం మార్చినట్లు పోలీసులు తెలిపారు. వెన్నెల అనే మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వినాయక్ రెడ్డి వెల్లడించారు. మాయమాటలు చెప్పి భారీగా వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.
News October 10, 2025
ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ నిర్వహించండి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో జీఎస్టీ 2.Oలో భాగంగా శుక్రవారం ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ కం సేల్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కలెక్టరేట్ నుంచి గురువారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నిత్యావసర వస్తువులతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా భారీగా తగ్గాయన్నారు.
News October 10, 2025
ఒంగోలు: ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభించాలని వినతి

సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. ప్రకాశం జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. ఒంగోలు సమీపంలో ఎయిర్పోర్ట్ పనులు త్వరగా మొదలయ్యేలా చూడాలని కోరారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 39 రోడ్ల పునర్నిర్మాణానికి రూ.135 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. ఒంగోలులో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంపైనా సీఎంతో మాట్లాడారు. సీఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.