News October 9, 2025
వేరు శనగలో దిగుబడి పెరగాలంటే!

వేరు శనగ నాణ్యత, దిగుబడి పెరగడానికి జింక్ చాలా కీలకం. ఈ సూక్ష్మపోషకం తగ్గినప్పుడు మొక్కలో ఎదుగుదల ఉండదు. ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈనెలకు ఇరువైపులా తుప్పురంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ను 3 పంటలకొకసారి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
Similar News
News October 10, 2025
పర్ఫెక్షనిస్ట్ పేరెంటింగ్తో ఇంపోస్టర్ సిండ్రోమ్

కెరీర్లో మంచి పొజిషన్లో ఉన్నా చాలామంది ఇంపోస్టర్ సిండ్రోమ్కు గురవుతున్నారు. తనను తాను తక్కువ చేసుకోవడం, ఆత్మన్యూనతకు గురవ్వడం, తన మాటకు విలువ ఉండదనే భావన ఇంపోస్టర్ సిండ్రోమ్ లక్షణాలు. అయితే దీనికి బీజాలు చిన్నప్పుడే పడతాయంటున్నారు నిపుణులు. తమ పిల్లలు అన్నిట్లో ముందుండాలని పేరెంట్స్ ఎప్పుడూ ఒత్తిడి చేస్తూ, వారిని తిడుతూ ఉంటే అది పెద్దయ్యాక ఇంపోస్టర్ సిండ్రోమ్కి దారితీస్తుందంటున్నారు నిపుణులు.
News October 10, 2025
న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేస్తా: పవన్

AP: అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని Dy.CM పవన్ స్పష్టం చేశారు. కాకినాడ(D) ఉప్పాడలో ఫార్మా కంపెనీల వ్యర్థాల సమస్యపై మాట్లాడారు. ‘మిమ్మల్ని వంచించాలని ప్రయత్నించడం లేదు. మీకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా. అభిమానం కంటే పదవులు ఎక్కువ కాదు. సమస్య పరిష్కారానికి ప్లాన్ చేయాలంటే 100 రోజులు పడుతుంది. క్యాబినెట్లో మాట్లాడి న్యాయం చేస్తా’ అని హామీ ఇచ్చారు.
News October 10, 2025
మరో అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈ నెల 11 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో వచ్చే వారం తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా నైరుతి రుతుపవనాలతో దేశంలో సాధారణ వర్షపాతం కంటే 8% అధికంగా నమోదైందని అధికారులు తెలిపారు.