News October 9, 2025
సంగారెడ్డి: ‘BAS బకాయిలు చెల్లించాలని వినతి’

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు మూడు సంవత్సరాల బకాయిలు చెల్లించాలని కోరుతూ కలెక్టర్ ప్రావీణ్యకు గురువారం వినతిపత్రం సమర్పించారు. మూడు సంవత్సరాల నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో అప్పులు చేయాల్సి వచ్చిందని పాఠశాల యజమాన్యాలు తెలిపాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బకాయిలు చెల్లించేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో రామచంద్ర రెడ్డి, వనజా రెడ్డి, లింగాగౌడ్ పాల్గొన్నారు.
Similar News
News October 10, 2025
బూర్జ: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు నమోదు

ప్రేమ పేరుతో మోసం చేసిన ఓ యువకుడుపై బూర్జ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఎం.ప్రవల్లిక వివరాలు మేరకు.. బూర్జ మండలం ఓ గ్రామానికి చెందిన యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లికి నిరకరించడంతో సదరు బాలిక ఫిర్యాదు మేరకు గురువారం ఆ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News October 10, 2025
SRSP: 24 గంటల్లో 74,502 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 74,502 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు చెప్పారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు 75,394 క్యూసెక్కుల ఇన్ ఫ్లోగా వస్తుండగా 21 గేట్ల ద్వారా 65,604 క్యూసెక్కులు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో తాజాగా 80.053 TMCల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.
News October 10, 2025
BJP-RSS సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి: రాహుల్

హరియాణాలో IPS ఆఫీసర్ పూరన్ కుమార్ ఆత్మహత్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ BJP-RSSను విమర్శించారు. ‘కులం పేరుతో మానవత్వాన్ని అణచివేస్తున్న సోషల్ పాయిజన్కు ఇది నిదర్శనం. కులం పేరిట IPS అధికారి అవమానానికి గురైతే ఇక సాధారణ దళితుడి పరిస్థితేంటి? బలహీనవర్గాలకు జరుగుతున్న అన్యాయానికి ఇది అద్దం పడుతోంది. BJP-RSSల విద్వేషం, మనువాద మనస్తత్వం సమాజాన్ని విషపూరితం చేస్తున్నాయి’ అని ఆరోపించారు.