News October 10, 2025
త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లిస్తాం: లోకేశ్

AP: IT, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఆ శాఖపై సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ.. ‘స్టార్టప్ల వృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి. మరో 2 నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వెయ్యి సేవలను అందుబాటులోకి తేవాలి’ అని అన్నారు. రేపు క్యాబినెట్ భేటీలో ప్రవేశపెట్టనున్న క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీపైనా చర్చించారు.
Similar News
News October 10, 2025
మోహన్ బాబు వర్సిటీకి ఊరట

AP: <<17943028>>MB వర్సిటీకి<<>> హైకోర్టులో ఊరట దక్కింది. నిబంధనల ఉల్లంఘనతో దీని గుర్తింపు రద్దు, ₹26.17 కోట్ల అదనపు ఫీజు రిఫండ్ కోసం ఇటీవల APSCHE ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై వర్సిటీ కోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. ADMIN బాధ్యతల్ని SVUకి అప్పగించాలన్న ఉత్తర్వునూ నిలిపివేసింది. ఆదేశాలిచ్చినా సిఫార్సులను వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై APSCHEని ప్రశ్నించింది. తమ ఉత్తర్వులు అప్లోడ్ చేయాలని ఆదేశించింది.
News October 10, 2025
అసలైన భక్తికి నిదర్శనం మయూరధ్వజుని త్యాగం

నిజాయితీ, భక్తితో సేవించేవారికి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అనడానికి మయూరధ్వజుని కథే నిదర్శనం. శ్రీకృష్ణుడు ఇచ్చిన పరీక్షలో తన భక్తిని నిరూపించుకోవడానికి ఆయన తన కుమారుడిని సగంగా కోసి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అతిథి రూపంలో వచ్చిన భగవంతుడిని సంతృప్తి పరచడమే ఆయన ధర్మంగా భావించాడు. అలాంటి గొప్ప ఆత్మత్యాగానికి ముగ్ధుడైన శ్రీకృష్ణుడు, వెంటనే ఆయనకు సాక్షాత్కారం ఇచ్చి, శుభాన్ని కలిగించాడు. <<-se>>#Bakthi<<>>
News October 10, 2025
డిసెంబర్లో ఐపీఎల్-2026 వేలం!

ఐపీఎల్-2026 వేలం డిసెంబర్ 13-15 తేదీల్లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐతో ఫ్రాంచైజీలు చర్చిస్తున్నట్లు Cricbuzz వెల్లడించింది. ప్లేయర్ల రిటెన్షన్కు నవంబర్ 15 వరకు డెడ్లైన్ ఉండొచ్చని సమాచారం. గత రెండు సీజన్లలో విదేశాల్లో వేలం జరగ్గా, ఈ సారి భారత్లో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటన్నింటిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.