News April 7, 2024

నరసన్నపేటకు పెద్దన్న ఎవరో?

image

AP: శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గం 1989 నుంచి ధర్మాన కుటుంబానికి కంచుకోటగా ఉంది. 4సార్లు ధర్మాన కృష్ణదాస్, 2సార్లు ధర్మాన ప్రసాదరావు గెలిచారు. మొత్తంగా 7సార్లు INC, 4సార్లు TDP, 2సార్లు YCP, 2సార్లు స్వతంత్ర పార్టీ, ఓసారి కృషికార్ లోక్ పార్టీ విజయం సాధించింది. ఈసారి YCP నుంచి సిట్టింగ్ MLA ధర్మాన కృష్ణదాస్, TDP నుంచి బగ్గు రమణమూర్తి బరిలో దిగుతున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News October 24, 2025

విగ్రహంలో దేవుడు ఉంటాడా?

image

భగవంతునికి చంచల, నిశ్చల అనే రెండు రూపాలున్నాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో చలనము లేని రూపమే విగ్రహం. ఈ రూపంలో కూడా పరమాత్మ నిత్యం కొలువై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విగ్రహాన్ని రాతిగా చూడరాదని అంటుంటారు. భక్తుల కోసం, భక్తుల ఆరాధన కోసం భగవంతుడు తన లీల ద్వారా ఈ రూపంలో కొలువై ఉంటాడట. భక్తులచే పూజలందుకొని అనుగ్రహాన్ని కల్పిస్తాడట. విగ్రహంలో దేవుడు లేడన్న మాట అవివేకం. <<-se>>#WhoIsGod<<>>

News October 24, 2025

చిన్నారుల్లో హెయిర్ ఫాల్ అవుతోందా?

image

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా హెయిర్‌ఫాల్ అందర్నీ ఇబ్బంది పెడుతోంది. చిన్నారుల్లో కూడా ఈ సమస్య పెరుగుతోందంటున్నారు నిపుణులు. పిల్లల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణం పౌష్టికాహార లోపం. పిల్లలకు ఐరన్, జింక్, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే మంచి సమతులాహారం పెట్టడంతో పాటు జుట్టును గట్టిగా లాగి దువ్వడం, బిగించడం మానుకోవాలంటున్నారు. కొంతమంది పిల్లల్లో జ్వరాలు వచ్చి తగ్గాక కూడా హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది.

News October 24, 2025

19 మృతదేహాలు వెలికితీత

image

AP: కర్నూలు బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. బస్సులో ఇద్దరు పిల్లలు సహా మొత్తం 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రయాణించినట్లు తెలిపారు. 21 మంది సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.