News October 10, 2025
కృష్ణా: ఉపాధ్యాయుల పోరుబాట.. నేటి నుంచి బోధనేతర యాప్ల బహిష్కరణ

బోధనేతర పనులపై ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు పోరుబాటకు సిద్ధమయ్యారు. బోధనేతర అంశాలకు సంబంధించిన యాప్ లను శుక్రవారం నుండి బహిష్కరిస్తున్నట్టు ఫ్యాప్టో ప్రకటించింది. సంఘ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్, జిల్లా విద్యాశాఖాధి ఆఫీసుల్లో వినతిపత్రాలు అందజేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పనులు మాత్రమే చేస్తామని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ అంబటిపూడి సుబ్రహ్మణ్యం తెలిపారు.
Similar News
News October 10, 2025
కృష్ణా: గుంతల మయంగా గ్రామీణ ప్రాంత రహదారులు

రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో దాదాపు 75 శాతం రహదారులు ఇప్పటికీ గుంతలమయంగానే ఉండటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా రహదారుల పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామన్నా హామీ ఎక్కడ అని ప్రశ్నించారు.
News October 10, 2025
సముద్ర తీర మడ భూముల మాయం.. అధికారుల మౌనం.!

కృష్ణా జిల్లాలోని సముద్రతీర ప్రాంతాల్లో మడ భూములు కనుమరుగవుతున్నాయి. పాలకుల కబంధహస్తాల్లో చిక్కుకున్న ఈ మడభూములు ఇప్పుడు చెరువులుగా మారాయి. ఇదే పరిస్థితి పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లోనూ కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో ఉన్న మడ భూములలో దాదాపు కనుచూపు మేర ఇప్పటికే చెరువులుగా మారిపోయాయని సమాచారం. ప్రకృతి సంపదలను రక్షించాల్సిన అధికారులు నిశ్చలంగా ఉండడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News October 10, 2025
ఉయ్యూరులో రూ. 12 లక్షలు టోకరా

తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి దామోదర్, ఆయన కుమారుడు యువ కళ్యాణ్ ఒకరి వద్ద రూ.12 లక్షలు కాజేశారు. ఉయ్యూరులో దామోదర్ ‘విజయ దుర్గ UPVC విండోస్ అండ్ డోర్స్’ పేరుతో షాపు నిర్వహిస్తున్నాడు. షాపుకు వచ్చిన ఓ కస్టమర్ తిరుమల వెళ్తున్నాడని తెలుసుకొని, తనకి అక్కడ పరిచయాలు ఉన్నాయని నమ్మించి ఈ మొత్తం వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.