News October 10, 2025

ప్రకాశం: ‘సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం’

image

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సేవల పట్ల ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధులు – మందుల పంపిణీ అంశాలపై జేసీ గోపాలకృష్ణ వీడియో కాన్ఫరెన్స్లో వివరణ ఇచ్చారు.

Similar News

News October 10, 2025

PKSM: తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయా..?

image

తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఐటీ కోర్ పోలీసులు విస్తృతంగా సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. కేవైసీ పేరుతో జరిగే మోసాల పట్ల చైతన్యపరుస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏ బ్యాంక్ కూడా కేవైసీ గురించి కాల్స్ చేసి ఓటీపీ అడగదని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

News October 10, 2025

కనిగిరి: సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు కౌన్సెలింగ్‌ పూర్తి

image

మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు కౌన్సెలింగ్‌ పూర్తయినట్లు ప్రకాశం డీఈవో కిరణ్‌కుమార్‌ తెలిపారు. కనిగిరిలోని ఆల్ఫా అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు. జిల్లాలో 124 మంది సెకండరీ గ్రేడ్‌ తెలుగు, ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైనట్లు తెలిపారు. సదరు టీచర్లు సోమవారం నుంచి వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరతారన్నారు.

News October 10, 2025

ఒంగోలు: ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభించాలని వినతి

image

సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు. ప్రకాశం జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు. ఒంగోలు సమీపంలో ఎయిర్‌పోర్ట్ పనులు త్వరగా మొదలయ్యేలా చూడాలని కోరారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 39 రోడ్ల పునర్నిర్మాణానికి రూ.135 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. ఒంగోలులో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంపైనా సీఎంతో మాట్లాడారు. సీఎం సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.