News April 7, 2024

కామారెడ్డి:’వడ దెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలి’

image

వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ సూచించారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు అధికంగా నమోదవుతున్నందున ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎట్టి పరిస్థితులలో ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ప్రజలకు తెలిపారు.  ఉదయం, సాయంత్రం పనులు చేసుకోవాలన్నారు.

Similar News

News November 10, 2025

నిజామాబాద్‌లో కూరగాయల ధరల వివరాలు..!

image

నిజామాబాద్ లో కూరగాయల మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట రూ.20 కేజీ, వంకాయ రూ.35, బెండకాయ బీరకాయ, దొండకాయ రూ.50, చిక్కుడు రూ.50, క్యాబేజీ రూ.25, కాలిఫ్లవర్ రూ.50, మిరపకాయ రూ.35, కాకరకాయ రూ.40, బీరకాయ, బెండకాయ రూ.50, దొండకాయ రూ.50, పాలకూర రూ.50, తోటకూర రూ.30, గోరుచిక్కుడు రూ.50, మునగా కాయ రూ.70, ఉల్లిగడ్డ రూ.100కు ఐదు కేజీలు, సొరకాయ రూ.20, క్యారెట్ రూ.50లకు కేజీ ధర పలుకుతున్నాయి.

News November 8, 2025

KMR: లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

image

ఆన్‌లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. రామారెడ్డి(M) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాధితుడి నుంచి 7 విడతలుగా రూ.1,02,960 బదిలీ చేయించుకున్నాడు. మోసపోయినట్లు తెలిసి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News November 8, 2025

పసుపు సాగు పొలాలను సందర్శించిన ఎంపీ అర్వింద్

image

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పసుపు సాగు పొలాలను ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి పసుపు ధరల పరిస్థితి, ఆకుల నుంచి నూనె తీసి అదనపు ఆదాయం పొందే యోచన గురించి తెలుసుకున్నారు. అలాగే, బోర్డు శాశ్వత కార్యాలయానికి స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఛైర్మన్‌ను అడిగి తెలుసుకున్నారు.