News October 10, 2025
HYD: రూ.18 కోట్లు మోసం చేసిన ఘరానా లేడి

విద్య అనే ఓ ఘరానా లేడీ తోటి మహిళకు రూ.18 కోట్ల మేర మోసం చేసిన ఘటన పటాన్చెరులో వెలుగు చూసింది. సికింద్రాబాద్లోని వారణాసిగూడకు చెందిన విద్య.. బంగారం తీసుకుని ఎక్కువ సొమ్ము చెల్లిస్తానని మోసం చేసి పటాన్చెరుకు మకాం మార్చినట్లు పోలీసులు తెలిపారు. వెన్నెల అనే మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వినాయక్ రెడ్డి వెల్లడించారు. మాయమాటలు చెప్పి భారీగా వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.
Similar News
News October 10, 2025
జూబ్లీహిల్స్లో హిందువులకు రక్షణ లేదు: BJP

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హిందువులకు రక్షణ లేదని BJP స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని ఆఫీస్లో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఎర్రగడ్డలో నివాసాల మధ్య శ్మశానవాటిక కోసం 2 ఎకరాల స్థలం ఇవ్వడం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. జూబ్లీహిల్స్లో గుడులను కూల్చుతున్నారని, హిందువుల మీద దాడులు ఏంటని రాంచందర్ నిలదీశారు. BJPతోనే అభివృద్ధి అంటూ ఆయన పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?
News October 10, 2025
Political Trend: జూబ్లీహిల్స్ BJP అభ్యర్థిగా BRS!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట సిటీ పాలిటిక్స్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. BJP అభ్యర్థి INC నుంచి పోటీ చేస్తాడని BRS నేతలు సెటైర్లు వేశారు. కౌంటర్గా BJP అభ్యర్థి కూడా BRS నుంచేనని TPCC లీడర్ సామ రామ్మోహన్ ట్వీట్ చేశారు. ‘కారు గుర్తుకు ఓటు కమల బలోపేతం కోసం.. BJP కార్యకర్తలు, BRS మైనారిటీ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే BRS-INC ఒక్కటే అని BJP ఆరోపిస్తోంది.
News October 10, 2025
HYD: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడు గంజాయి మత్తులో బాలిక సోదరుడి ముందే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి అనారోగ్యానికి గురి అవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. బాధితురాలి తల్లి సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.