News October 10, 2025
KMR: డ్రంక్ అండ్ డ్రైవ్..58 మందికి శిక్ష

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు నిరంతరం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టుబడిన 58 మంది వాహనదారులకు గురువారం కోర్టు శిక్షలు విధించింది. దేవునిపల్లి పరిధిలో 4 మందికి రెండ్రోజులు, 6 మందికి ఒక్కరోజు జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి చొప్పున జరిమానా పడింది. మరో 48 మందికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు.
Similar News
News October 10, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: కంప్లైంట్ నంబర్లు ఇవే!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికతలో ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎవరైనా.. ఎక్కడైనా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిస్తే ఈ నంబర్లకు కాల్ చేసి చెప్పొచ్చు. కమిటీ ఛైర్పర్సన్గా మంగతయారు నియమితులయ్యారు. 91776 08271, 91212 40116, 98490 44893 నంబర్లు ఏర్పాటు చేశారు.
News October 10, 2025
నలభై దాటిందా..ఇవి తినండి

నలభై ఏళ్లు దాటిన తర్వాత మహిళల ఆరోగ్యంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. సమయానికి ఆహారం తీసుకుంటున్నా కొన్నిసార్లు నీరసం కమ్మేస్తుంటుంది. కాబట్టి బ్యాలెన్డ్స్ డైట్ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా అన్నిరకాల విటమిన్లు అందేందుకు తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఆహారంలో ఉండాలి. పాల ఉత్పత్తులు, మాంసాహారం, గుడ్లు తీసుకోవాలి. పీచు పదార్థాలతో పాటు నీటిని ఎక్కువగా తాగాలి. <<-se>>#WomenHealth<<>>
News October 10, 2025
HYD: రాంగ్ సైడ్ డ్రైవింగ్..15,641 కేసులు నమోదు

సైబరాబాద్ పోలీసులు 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు రాంగ్ సైడ్ డ్రైవింగ్పై 15,641 కేసులు నమోదు చేశారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు రూ.72,02,900 జరిమాణాలు విధించినట్లు వెల్లడించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రమాదానికి ముప్పు అని తెలిపారు.