News October 10, 2025

ఏలూరు: నర్సింగ్ జాబ్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

AP స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కత్తర్ (దోహా)లో హోమ్ కేర్ నర్సింగ్ జాబ్స్ కొరకు మైనారిటీ యువతీ, యువకులకు నుంచి దరఖాస్తు కోరుతున్నామని జిల్లా మైనారిటీ ఆర్థిక సంస్థ కార్యనిర్వాహన సంచాలకులు ప్రభాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. BSC/GNM నర్సింగ్ చదివి అనుభవం కలిగిన 21-40 సం.లు లోపు వారు అర్హులు అన్నారు. ఈ నెల 12లోగా దరఖాస్తు అందించాలన్నారు.08812-242463 సంప్రదించాలన్నారు.

Similar News

News October 10, 2025

యాదాద్రి: ఫోన్‌లో మాట్లాడి.. ఉరేసుకున్న యువకుడు.!

image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన డ్రైవర్ నల్ల శంకర్ (22) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్టోబర్ 9 రాత్రి తల్లిదండ్రులు వేరే ఇంటికి వెళ్లగా, శంకర్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఈరోజు ఉదయం 6 గంటలకు వంటగది పైకప్పుకు చీరతో ఉరేసుకుని కనిపించాడు. ఓ అమ్మాయితో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని ఫిర్యాదు అందినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 10, 2025

ఇంత నిర్లక్ష్యం దేనికి ఈశ్వరా..?

image

శ్రీకాళహస్తి ఆలయంలో మరోసారి భద్రత వైఫల్యం వెలుగు చూసింది. గురువారం తమిళనాడుకు చెందిన భక్తులు రూ.750 రాహు–కేతు పూజ అనంతరం వాయిలింగేశ్వరుడి దర్శనం ముగించుకుని నాగశిలను ఆలయంలో ప్రతిష్ఠాపన చేసే ప్రయత్నం చేశారు. ఆలయ మహాద్వారం వద్ద హోమ్ గార్డులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. భక్తులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

News October 10, 2025

భూ సేకరణ సమస్యలు త్వరితగతన పరిష్కరించాలి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టర్ రెవిన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. భారత జాతీయ రహదారి సంస్థ, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు భరద్వాజ్, రెవిన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను గురించి చర్చించారు.