News October 10, 2025
విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న రోహిత్, కోహ్లీ!

స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. 2027 ODI వరల్డ్కప్ వాళ్ల లక్ష్యమైతే అందులో 3-4 మ్యాచులు ఆడాలని చెప్పినట్లు తెలుస్తోంది. నవంబర్లో సౌతాఫ్రికా, జనవరిలో న్యూజిలాండ్తో సిరీస్లు ఉన్నాయి. మధ్యలో విజయ్ హజారే ట్రోఫీ జరుగుతుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లు దేశవాళీలో ఆడాలని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పడం తెలిసిందే.
Similar News
News October 10, 2025
సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్

TG: రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలపై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. వెల్ఫేర్ సొసైటీలకు రూ.60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు. ఒక్కో ఎస్సీ, బీసీ సొసైటీకి రూ.20కోట్లు.. ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ.10కోట్ల నిధులు రిలీజ్ చేశారు. సొసైటీ సెక్రటరీకి ఫండ్ వినియోగించే అధికారం కల్పించారు. సొసైటీల స్థాయిలోనే హాస్టళ్లలో సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.
News October 10, 2025
ADR తప్పుడు అఫిడవిట్లపై సుప్రీం అసంతృప్తి

AP: బిహార్ SIRపై దాఖలైన కేసులో లాయర్ ప్రశాంత్ భూషణ్ సమర్పించిన అఫిడవిట్లపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పేర్లు తొలగించారంటూ అఫిడవిట్లో పేర్కొన్నవారు సరైన పత్రాలు అందించలేదని ECI న్యాయవాది ద్వివేది తెలిపారు. ఇలాంటివి మరిన్ని ఉన్నాయని, వెరిఫై సాధ్యం కాదని ప్రశాంత్ భూషణ్ సమర్థించుకోబోయారు. అయితే తమకు సమర్పించే ముందే పరిశీలించాల్సిన బాధ్యత లేదా అని ప్రశాంత్, ADRలను కోర్టు ప్రశ్నించింది.
News October 10, 2025
నోబెల్ పీస్ ప్రైజ్ గెలిస్తే ఎన్ని రూ.కోట్లు ఇస్తారంటే?

నోబెల్ <<17966688>>పీస్ ప్రైజ్<<>> ప్రకటించిన నేపథ్యంలో ఈ బహుమతి గెలిచిన వారికి ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తారన్న అంశంపై చర్చ మొదలైంది. నోబెల్ శాంతి బహుమతి విజేతకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్(దాదాపు రూ.10.25 కోట్లు) ప్రైజ్ మనీ, పతకం ఇస్తారు. మరోవైపు ట్రంప్కు నోబెల్ ఇవ్వకపోవడంపై కమిటీ వివరణ ఇచ్చింది. ఆయన పేరిట వచ్చిన నామినేషన్లు అన్నీ గడువు(జనవరి 31) ముగిశాక వచ్చినవేనని స్పష్టం చేసింది.