News October 10, 2025
మార్కెట్ కమిటీలు, రైతు బజార్లపై కీలక సూచన

AP: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, రైతు బజార్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లను అనుసంధానం చేసి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 218 మార్కెట్ కమిటీల స్థలాల్లో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్స్, కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలని.. రైతులు, వినియోగదారులు లాభపడేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.
Similar News
News October 10, 2025
రేపు ఉదయం లోగా వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30గంటల లోపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలకు ఛాన్స్ ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది?
News October 10, 2025
నోబెల్ ప్రైజ్ ప్రతిష్ఠ కోల్పోయింది: పుతిన్

NOBEL పీస్ ప్రైజ్కు వెనిజులా విపక్ష నేత మరియా ఎంపికవడం తెలిసిందే. దీనిపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్ స్పందించారు. ‘ట్రంప్ అన్నివిధాలా అర్హులు. మిడిల్ ఈస్ట్లో యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పుతున్నారు. శాంతికోసం పనిచేయని పలువురికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అది తన ప్రతిష్ఠను కోల్పోయింది’ అని వ్యాఖ్యానించారు. అటు ‘శాంతిపై నోబెల్వి మాటలే. ట్రంప్ చేసి చూపించారు. ప్రైజ్కు అర్హులు’ అని నెతన్యాహు అన్నారు.
News October 10, 2025
కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీం తీర్పు రిజర్వ్

కరూర్ తొక్కిసలాటపై SIT ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ TVK దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. TN పోలీసు అధికారులతోనే SIT ఏర్పాటు చేయాలనే HC తీర్పును వ్యతిరేకించింది. ఆపై జడ్జిలు జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ అంజరియాతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కరూర్లో TVK విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.