News October 10, 2025
బ్రహ్మోత్సవాల పనితీరుపై సమావేశం

9 రోజుల పాటు వైభవంగా సాగిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల పనితీరుపై తిరుపతి మహతి ఆడిటోరియంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. TTD, పోలీసులలోని వివిధ విభాగల పనితీరు, ఎదుర్కొన్న సమస్యలపై సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చేయడానికి అవకాశం కలుగుతుందని SP సుబ్బారాయుడు, TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ సూచించారు. JEO వీరబ్రహ్మం, డీఎఫ్వో ఫణి కుమార్ పాల్గొన్నారు.
Similar News
News October 11, 2025
బేగంపేట్ సీఎం ప్రజావాణికి 275 దరఖాస్తులు

బేగంపేట్లోని ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 275 దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 76, రెవెన్యూ శాఖకు సంబంధించి 43, ఇందిరమ్మ ఇళ్ల కోసం 85, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 69 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
News October 11, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> దేవరుప్పుల: దాడి చేసిన వ్యక్తికి రిమాండ్
> జనగామలో సెల్ టవర్ నిర్మించొద్దని నిరసన
> ప్రధానమంత్రి దన్, ధ్యాన కృషి యోజన పథకానికి జిల్లా ఎంపిక
> కలెక్టరేట్ ఎదుట పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ జేఏసీ నిరసన
> అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల హాజరు శాతాన్ని పెంచాలి: కలెక్టర్
> బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాలి: అదనపు కలెక్టర్
> రఘునాథపల్లి: కుక్కల దాడిలో 7 మేక పిల్లలు మృతి
News October 11, 2025
రాజధాని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

AP: రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, భూయజమానులకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక కౌలును విడుదల చేసింది. 495 మందికి అందాల్సిన రూ.6.6కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. బ్యాంకు లింకేజీ సమస్యలతో పాటు పలు కారణాలతో జమ కాని వారికి 9వ, 10వ, 11వ ఏడాదికి సంబంధించి కౌలు సొమ్ము జమ చేసినట్లు సీఆర్డీఏ తెలిపింది.