News October 10, 2025
డెహ్రాడూన్ స్పెషల్ వీక్లీ ట్రైన్ టెర్మినల్లో మార్పు

చర్లపల్లి- డెహ్రాడూన్ మధ్య రాకపోకలు సాగించే రైలు టెర్మినల్ మార్పు చేసినట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 14 నుంచి ప్రతీ మంగళవారం రైలు నం.07077తో హైద్రాబాద్లో ఉదయం 4 గంటలకు బయలుదేరి సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి మీదుగా రాకపోకలు సాగనున్నాయి. తిరుగు ప్రయాణంలో రైలు నం.07078 హైద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ప్రతీ గురువారం ఉ. 7గంటలకు డెహ్రాడూన్ లో బయలుదేరుతుంది.
Similar News
News October 11, 2025
చైనాకు ట్రంప్ మరోసారి హెచ్చరికలు

అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించడంతో చైనాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి ప్రతిచర్యగా చైనా ఉత్పత్తులపై మరోసారి భారీగా సుంకాలు తప్పవని హెచ్చరించారు. చైనాతో స్నేహంగా ఉంటున్నా తాజా చర్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ తరుణంలో జిన్పింగ్తో భేటీకి కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మరో 2 వారాల్లో సౌత్ కొరియా పర్యటన సందర్భంగా జిన్ పింగ్తో ట్రంప్ భేటీ కావాల్సి ఉంది.
News October 11, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 11, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.19 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.57 గంటలకు
✒ ఇష: రాత్రి 7.09 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 11, 2025
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ పరిశీలించిన చిత్తూరు ఎస్పీ

చిత్తూరులో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ను ఎస్పీ తుషార్ డూడీ శుక్రవారం పరిశీలించారు. త్వరలోనే రిక్రూట్ కానిస్టేబుల్లకు శిక్షణ ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. శిక్షణ ప్రమాణాలు అత్యుత్తమంగా ఉండేలా అన్ని విభాగాలను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గదులు పరిశుభ్రంగా గాలి, వెలుతురు ఉండేలా చూడాలని ఆదేశించారు.