News October 10, 2025
బ్రహ్మసముద్రంలో కేజీబీవీ విద్యార్థి మృతి

బ్రహ్మసముద్రం కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న చందన శుక్రవారం మృతి చెందిందినట్లు విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. వారి వివరాల మేరకు.. పడమటి కోడిపల్లి గొల్లల దొడ్డికి చెందిన చందన కేజీబీవీలో చదువుతోంది. కడుపు నొప్పి అధికంగా ఉందని SO మహాలక్ష్మికి చెప్పింది. చందనను SO, తల్లిదండ్రులు కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 11, 2025
కరీంనగర్: 277 పెండింగ్ చలాన్ల బైక్ పట్టివేత

కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు ఉన్న ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నారు. గోదాం గడ్డకు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్కు చెందిన బైక్కు <<17964893>>277 చలాన్లలో రూ.79,845 జరిమానా <<>>బకాయి ఉన్నట్లు గుర్తించి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు.TS 02 EX 1395 అనే బండికి భారీ జరిమానాలు అనే శీర్షికతో Way2Newsలో కథనం వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఎట్టకేలకు భారీ జరిమానాలు ఉన్న వాహనాన్ని పట్టుకున్నారు.
News October 11, 2025
10,000+ జనాభా ఉంటే రూర్బన్ పంచాయతీలు: Dy.CM

AP: 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా గుర్తించనున్నట్లు <<17972541>>Dy.CM పవన్<<>> తెలిపారు. రూర్బన్ పంచాయతీలలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. గ్రేడ్-1 పంచాయతీల్లో పని చేస్తున్న 359 మంది కార్యదర్శులకు వేతన శ్రేణి పెంపుతో పాటు డిప్యూటీ MPDO కేడర్కు వారిని ప్రమోట్ చేస్తామన్నారు. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమించనున్నట్లు పేర్కొన్నారు.
News October 11, 2025
మూడో తరగతి నుంచే AI పాఠాలు!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో మూడో తరగతి నుంచే AIపై పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ను AI-రెడీగా మార్చాలని భావిస్తోంది. టీచర్లు AI టూల్స్ వాడి పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసేలా ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు జరుగుతున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు. కాగా కొన్ని CBSE స్కూళ్లలో ఇప్పటికే AIపై పాఠాలు బోధిస్తున్నారు.