News October 10, 2025
HYD: అక్టోబర్ 12న పోలియో చుక్కలు

నిండు ప్రాణానికి- రెండు చుక్కలు నినాదంతో అక్టోబర్ 12న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు DMHO డా.లలితాదేవి తెలిపారు. కలెక్టర్ నారాయణరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. HYD, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, హనుమకొండ జిల్లాలో నిర్వహిస్తున్నారు. RR జిల్లా పట్టణ ప్రాంతంలో 1,99,967 మందికి, గ్రామీణ ప్రాంతంలో 2,20,944 మొత్తం 4,20,911 చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.
Similar News
News October 11, 2025
KMR: 49 మద్యం దుకాణాలకు 90 అప్లికేషన్లు

కామారెడ్డి జిల్లాలోని వైన్ షాపుల దరఖాస్తుల ప్రక్రియ కోనసాగుతోంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 49 మద్యం దుకాణాలకు గాను 90 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. హనుమంతరావు ఓ ప్రకటనలో తెలిపారు. రెండవ శనివారం అయినప్పటికీ, అక్టోబర్ 11న కూడా దరఖాస్తులు యథావిధిగా స్వీకరించబడతాయని ఆయన స్పష్టం చేశారు.
News October 11, 2025
ఇకనైనా మారుతారా? జైలు శిక్షలు తప్పవన్న SP

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని జిల్లా SP రాజేష్ చంద్ర హెచ్చరించారు. శుక్రవారం 42 మందికి జైలు శిక్ష, జరిమానాలు విధిస్తూ న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారన్నారు. దేవునిపల్లి, కామారెడ్డి, సదాశివనగర్, మాచారెడ్డి పరిధిలోని 8 మందికి ఒక్కొక్కరికీ 1 రోజు జైలు శిక్ష, వెయ్యి చొప్పున ఫైన్ విధించారు. మిగిలిన 34 మందికి కలిపి రూ.34 వేల జరిమానా విధించారని SP వెల్లడించారు.
News October 11, 2025
దుబ్బాక ఆసుపత్రిని సందర్శించిన ASCI బృందం

దుబ్బాక ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రిని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ASCI) బృందం శుక్రవారం సందర్శించింది. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించిన బృందం జరుగుతున్న వైద్య సేవలపై ఆరా తీసి సంబంధిత రికార్డులను పరిశీలించారు. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు, పరిశుభ్రత సంతృప్తికరంగా ఉన్నాయని బృంద సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.