News October 10, 2025

తాండూరు: కొడుకు చితికి కొరివి పెట్టిన తల్లి

image

ఫిట్స్‌తో మృతి చెందిన కుమారుడికి దహన సంస్కారాలను నిర్వహించి చితికి తల్లి కొరివి పెట్టిన ఘటన తాండూరులో చోటుచేసుకుంది. మాదారం టౌన్షిప్‌కు చెందిన రాజమ్మ భర్త సింగరేణిలో పనిచేస్తూ చాలా ఏళ్ల క్రితం మరణించాడు. ఇద్దరు కొడుకులలో పెద్ద కొడుకు ఏడాది క్రితం మృతి చెందాడు. చిన్న కుమారుడు నరేష్ గురువారం ఫిట్స్‌తో మృతి చెందాగా శుక్రవారం తల్లి కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించింది.

Similar News

News October 11, 2025

స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్.. మెనూ ఇదే?

image

TG: వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ బడుల్లో ‘బ్రేక్ ఫాస్ట్’ స్కీమ్ అమలు చేస్తామని CM రేవంత్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. స్కూళ్లు రీఓపెన్ అయ్యే రోజు (జూన్ 12) నుంచే విద్యార్థులకు అల్పాహారం అందించే అవకాశం ఉంది. ఇప్పటికే మెనూ ఖరారైనట్లు తెలుస్తోంది. 3 రోజులు రైస్ ఐటమ్స్ (పొంగల్, కిచిడీ, జీరారైస్), 2 రోజులు రవ్వ ఐటమ్స్ (గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ), ఒక రోజు బోండా ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

News October 11, 2025

HYDలో రోజుకు ఐదుగురి ప్రాణాలు పోతున్నాయ్..!

image

HYDలో రోజుకు 31 చొప్పున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ప్రతిరోజు కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. మృతుల్లో ఎక్కువగా బైకర్లు, పాదచారులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ORRపై 2024లో జరిగిన ప్రమాదాల్లో రాచకొండ పరిధిలో 19 మంది, సైబరాబాద్ పరిధిలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

News October 11, 2025

మెడికల్ కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీహరి రావు తెలిపారు. DMLT కోర్సులో 30 సీట్లు ఉన్నాయని చెప్పారు. ఇంటర్‌లో బైపీసీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 28వ తేదీ లోపు కళాశాలలో అప్లై చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు http://gmckothagudem.org వెబ్ సైట్‌ను సందర్శించాలని కోరారు.