News October 11, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> దేవరుప్పుల: దాడి చేసిన వ్యక్తికి రిమాండ్
> జనగామలో సెల్ టవర్ నిర్మించొద్దని నిరసన
> ప్రధానమంత్రి దన్, ధ్యాన కృషి యోజన పథకానికి జిల్లా ఎంపిక
> కలెక్టరేట్ ఎదుట పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ జేఏసీ నిరసన
> అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల హాజరు శాతాన్ని పెంచాలి: కలెక్టర్
> బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాలి: అదనపు కలెక్టర్
> రఘునాథపల్లి: కుక్కల దాడిలో 7 మేక పిల్లలు మృతి

Similar News

News October 12, 2025

విశాఖ చేరుకున్న మంత్రి నారా లోకేశ్

image

మంత్రి నారా లోకేశ్ ఆదివారం కొద్దిసేపటి క్రితం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో రుషికొండ ఐటీ హిల్ నం.3లో సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మహిళల వన్డే మ్యాచ్‌ వీక్షించునున్నారు.

News October 12, 2025

మంచిర్యాల జిల్లాలో ప్రగతి పరుగులు..!

image

MNCL జిల్లాగా ఏర్పడి నేటికీ 9 వసంతాలు పూర్తయ్యాయి. మరి ఈ కాలంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది పునరాలోచన చేసుకోవాలి. ప్రత్యేక జిల్లా ఏర్పడ్డాక పరిపాలన పరిధి తగ్గి ప్రజలకు త్వరగా సేవలు అందుతున్నాయి. పలు విలీన గ్రామాలను కలిపి MNCL నగరపాలక సంస్థ ఏర్పడటం అభివృద్ధిలో కీలకమైంది. బెల్లంపల్లి, క్యాతనపల్లి, మందమర్రి, RKP అభివృద్ధి చెందుతున్నాయి. రైళ్ల రాకపోకలతో రవాణా మెరుగైంది. ఇంకేం కావాలో కామెంట్ చేయండి.

News October 12, 2025

చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

image

చిత్తూరు జిల్లాలో గత 24 గంటల్లో కురిసిన వర్షపాత వివరాలను అధికారులు తెలిపారు. అత్యధికంగా పెనుమూరు మండలంలో 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జీడి నెల్లూరులో 7.2, చిత్తూరు రూరల్ లో 5.4, కుప్పం 8.4, బంగారుపాలెం 1.6 యాదమరి 1, చిత్తూరు అర్బన్ 10.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు చెప్పారు. మొత్తం 7 మండలాలలో వర్షపాతం నమోదుకాగా 25 మండలాలలో వర్షం పడలేదన్నారు.