News October 11, 2025
సిర్పూర్ (టి): పెద్దపులి దాడిలో ఆవు మృతి

ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. శుక్రవారం సిర్పూర్ (టి) మండలం నవేగాం, ఇటిక్యాల గ్రామాల్లో పెద్దపులి సంచరించిందని అటవీ అధికారులు తెలిపారు. నవేగాంలో జుంగరి శివరామ్కు చెందిన ఆవుపై దాడి చేసి చంపినట్లు వెల్లడించారు. దీంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Similar News
News October 11, 2025
తిరుమలనాథునికి నిత్యం పూజలు జరిగేలా చూడాలి..!

వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామ పరిధిలో తిరుమలయ్య గుట్ట పై వెలసిన శ్రీ తిరుమలనాథ స్వామికి భనిత్యం పూజలు జరిగేలా చూడాలని పెద్దగూడెం గ్రామస్థులు వనపర్తి పట్టణవాసులు సంబంధిత శాఖ అధికారులను కోరుతున్నారు. ఎన్నో ఔషధ గుణాలున్న గుట్టపై ఉన్నాయి. తిరుమలయ్య గుట్టపై బీటీ రోడ్డు మరమ్మతులు, తాగునీటి వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రజలు జిల్లా అధికారులను కోరుతున్నారు.
News October 11, 2025
నెల్లూరులో రోజురోజుకు పెరుగుతున్న నేరాలు

నెల్లూరులో ఇటీవల నేరాలు పెరుగుతుండడంతో ప్రజల్లో భయం నెలకొంది. కత్తులతో బెదిరించి దోపిడీలు, హత్యలు చేయడం పెరిగాయి. పెన్నా బ్యారేజ్ వద్ద జరిగిన జంట హత్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. యువకులు గంజాయి మత్తులో కత్తులు దాచుకొని ప్రజలను బెదిరిస్తున్నారు. చిన్న గొడవలకు కూడా కత్తులు చూపడం ఫ్యాషన్గా మారింది. పోలీసు నిఘా సరిగా లేక, పాత నేరస్థులపై చర్యలు లేవన్న ఆరోపణలున్నాయి.
News October 11, 2025
TU: ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తగా ఆచార్య అపర్ణ

తెలంగాణ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం సమన్వయకర్తగా ఆచార్య అపర్ణను టీయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరి రావు నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఆమెకు నియామక పత్రం అందజేశారు. టీయూ పరిధిలోని అన్ని కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఆమె పలు అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ పదవులను నిర్వర్తించారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తగా నియమించడం పట్ల వీసీ, రిజిస్ట్రార్లకు కృతజ్ఞతలు తెలిపారు.