News October 11, 2025

విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

image

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ పరిధిలోని జేఎన్టీయూలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు. ఆన్ లైన్ లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని పేర్కొన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ నరసింహ పాల్గొన్నారు.

Similar News

News October 11, 2025

KU డిగ్రీ పరీక్ష ఫీజు తేదీలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీల నోటిఫికేషన్ శుక్రవారం KU అధికారులు విడుదల చేశారు. ఈ నెల 23 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు. అపరాధ రుసుము రూ.50తో ఈ నెల 25 వరకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. నవంబర్‌లో పరీక్షలు ఉంటాయని అధికారులు వివరించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News October 11, 2025

పవన్ హాన్స్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 13 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే(0CT 12)ఆఖరు తేదీ. అసిస్టెంట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్ తదితర ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి B.Tech/B.E, M.A, MCA, డిగ్రీ పూర్తయిన వారు, CHPL/ATPL లైసెన్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్: https://www.pawanhans.co.in/

News October 11, 2025

రాయదుర్గం పేరు చరిత్ర తెలుసా?

image

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పేరు చారిత్రక నేపథ్యంతో ప్రసిద్ధి చెందింది. ‘రాయల దుర్గం’ అంటే రాజుల కోట అనే అర్థంతో ఈ పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన పాలకులు నిర్మించిన రాయదుర్గ కోట చుట్టూ పట్టణం అభివృద్ధి చెందింది. కాలక్రమంలో రాయలదుర్గం రాయదుర్గంగా మారిందట. జీవితమంతా రచనా వ్యాసంగంలో తరించిన సాహితీమూర్తి దివంగత జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఇక్కడే జన్మించారు.