News October 11, 2025
కుప్పంలో పరిశ్రమకు ప్రధాని మోదీ శంకుస్థాపన

కుప్పంలో శ్రీజ మహిళా పాల ఉత్పత్తి సంస్థ ఇంటిగ్రేటెడ్ డైరీ, పశువుల దానా ప్లాంట్ ఏర్పాటుకు శనివారం PM నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. గుడిపల్లి(M) పొగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో సుమారు 45 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమకు సంబంధించి ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు సమక్షంలో పరిశ్రమ యాజమాన్యం MOU చేసుకున్నారు.
Similar News
News October 11, 2025
కరీంనగర్: DCC రేసులో ఎవరెవరున్నారు?

KNR <<17974062>>DCC అధ్యక్షుడి రేసులో<<>> సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి, రాజేందర్ రావు, పద్మాకర్ రెడ్డి, శ్రీరామ చక్రవర్తి, వైద్యుల అంజన్ కుమార్తో పాటు పలువురు పోటీపడుతున్నారు. సిరిసిల్ల నుంచి సంగీతం శ్రీనివాస్ రావు, చక్రధర్ రెడ్డి, గడ్డం నర్సయ్య ఆశిస్తున్నారు. జగిత్యాల నుంచి సుజిత్ రావు, జువ్వాడి కృష్ణారావు, కరంచంద్ ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి నుంచి తిరుపతియాదవ్, సదానందం, శశిభూషణ్, సారయ్యగౌడ్ రేసులో ఉన్నారు.
News October 11, 2025
వీఎంఆర్డీఏ కమిషనర్ బదిలీపై చర్చ!

VMRDA 2047 మాస్టర్ ప్లాన్తో విశాఖ నగర విస్తృత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుతోంది. ఈ తరుణంలో రెవెన్యూ అంశాలపై మంచి పట్టున్న VMRDA కమిషనర్ విశ్వనాథన్ బదిలీపై చర్చ నడుస్తోంది. అధికార వర్గాల నుంచి వస్తున్న వినతులు, అభ్యంతరాలను కమిషనర్ సీరియస్గా తీసుకోకపోవడం, ముక్కుసూటితనంగా ఉండటంతో ఆయనను బదిలీ చేయించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా అమరావతిలో I&PR డైరెక్టర్గా ఆయన బదిలీ అయ్యారు.
News October 11, 2025
అడవి పందులను చంపి తినేందుకు అనుమతివ్వాలి: కేరళ మంత్రి

అడవి పందుల బెడదతో పంట పొలాలు నాశనమవుతున్నాయని కేరళ వ్యవసాయశాఖ మంత్రి ప్రసాద్ అన్నారు. వాటిని చంపి తినేందుకు అనుమతిస్తే సమస్య తగ్గే అవకాశం ఉందని అలప్పుజలో జరిగిన ఓ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత చట్టం దానిని అనుమతించట్లేదని గుర్తు చేశారు. అడవి పందులు అంతరించిపోతున్న జాతి కాదని పేర్కొన్నారు. వైల్డ్లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్-1972 ప్రకారం వన్యప్రాణుల వేట చట్టవిరుద్ధం.