News October 11, 2025
సంగారెడ్డి: గిరిజన లా కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

సంగారెడ్డిలోని గిరిజన గురుకుల లా కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల 13, 14న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఇంటర్ పాసైన, లాసెట్-2025లో అర్హత పొందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఉన్న ఏకైక గిరిజన(Boys) గురుకుల న్యాయ కళాశాల ఇది. ఇక్కడ చేరితే 5 ఏళ్ల లా కోర్సును ఉచితంగా పూర్తి చేయవచ్చని అన్నారు.
-SHARE IT
Similar News
News October 11, 2025
మహిళలూ ఆధార్లో ఇంటిపేరు ఇలా మార్చుకోండి

వివాహం తర్వాత మహిళలు తమ ఇంటిపేరును మార్చుకుంటారు. అయితే ఆధార్కార్డులో కూడా ఈ వివరాలు మార్చాల్సి ఉంటుంది. దీనికోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ ఫారం తీసుకొని వివరాలు పూరించాలి. దానికోసం మ్యారేజ్ సర్టిఫికేట్, అఫిడవిట్ వంటి పత్రాలు ఇవ్వాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసి URN నంబర్ ఇస్తారు. అప్డేట్ అయిన తర్వాత కొత్త ఆధార్ను UIDAI వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
News October 11, 2025
ఇదేందయ్యా ఇది.. 100కు 137 మార్కులా?

రాజస్థాన్ జోధ్పూర్లోని MBM ఇంజినీరింగ్ వర్సిటీలో BE II సెమిస్టర్ విద్యార్థులకు ఊహించని పరిణామం ఎదురైంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 100 మార్కులకు ఏకంగా 103 నుంచి 137 రావడంతో అవాక్కయ్యారు. విషయం కాస్తా అధికారుల దృష్టికి చేరడంతో మార్కులను వెబ్సైట్ నుంచి తొలగించారు. టెక్నికల్ తప్పిదం వల్ల ఇలా జరిగినట్లు ఎగ్జామ్ కంట్రోలర్ అనిల్ గుప్తా తెలిపారు. త్వరలోనే ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.
News October 11, 2025
14న రాజమండ్రిలో జాబ్ మేళా

రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో మంగళవారం ప్రముఖ వాయుపుత్ర మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (వీఎంఎస్) కంపెనీలో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. 2020–2025 మధ్య డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని, జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.