News October 11, 2025

చెరువుగట్టు హుండీ ఆదాయం @40.46 లక్షలు

image

ప్రసిద్ధ శైవక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించుకున్న నగదు మొత్తం రూ. 40,46,640లు లభించాయి. గట్టుపైన స్వామివారి ప్రధానాలయ హుండీ, ఉపాలయాల హుండీలను తెరిచి లెక్కించగా రూ.34,07,100, గుట్ట కింద పార్వతీ అమ్మవారి ఆలయం వద్ద హుండీలను తెరిచి లెక్కించగా రూ.6,39,540ల ఆదాయం లభించిందని ఈవో నవీన్ కుమార్ తెలిపారు.

Similar News

News October 11, 2025

‘వాడపల్లి ఎస్సైపై చర్యలు’ కథనం అవాస్తవం: ఎస్పీ

image

వాడపల్లి ఎస్సై, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినట్లుగా ప్రచురించిన వార్తల్లో వాస్తవం లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేస్తే, సంబంధిత వ్యక్తులు, పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అవాస్తవ కథనాలు ప్రచురించడం తగదని సూచించారు.

News October 11, 2025

నల్గొండ: స్పందన కరువు: పెరిగిన ఫీజే కారణం?

image

జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తులకు స్పందన కరువైంది. 2025–27 సంవత్సరానికి 154 దుకాణాలకు గాను ఇప్పటివరకు కేవలం 96 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 2023లో 155 షాపులకు 7,037 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం దరఖాస్తు ఫీజును భారీగా పెంచడం వల్లే ఈసారి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గత నెల 26న ఎక్సైజ్ శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.

News October 11, 2025

NLG: కమీషన్ డబ్బులు ఇచ్చేది ఎప్పుడో!?

image

రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో పరేషాన్ అవుతున్నారు. నెలల తరబడి కమీషన్ డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దుకాణాల అద్దెలు సైతం కట్టలేకపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కమీషన్ చెల్లింపులు ఆలస్యం కావడంతో జిల్లాలో 997 రేషన్ షాపుల డీలర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి కమీషన్ బకాయిలను చెల్లించాలని కోరారు.