News October 11, 2025

జనగామ: నేడు కలెక్టరేట్లో పీఎండీడీకేవై పథకం ప్రారంభోత్సవం

image

జనగామ కలెక్టరేట్లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని శనివారం ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ప్రారంభ ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, యశస్విని రెడ్డిలు హాజరు కానున్నారు.

Similar News

News October 11, 2025

175 వద్ద రనౌట్.. జైస్వాల్ ఏమన్నారంటే?

image

WIతో జరుగుతున్న 2వ టెస్టులో 175 రన్స్ వద్ద ఔటవ్వడంపై జైస్వాల్ స్పందించారు. ఇది ఆటలో భాగమేనని తెలిపారు. తానెప్పుడూ లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ గేమ్‌ను వీలైనంత ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తానన్నారు. బంతి మూవ్ అయిన టైంలో గంటసేపు క్రీజులో ఉండగలిగితే ఈజీగా రన్స్ చేయగలనని అనుకున్నట్లు వివరించారు. ఇప్పటికీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారన్నారు.

News October 11, 2025

MBNR: విషాదం.. చేప‌ల వేట‌కు వెళ్లి అన్న‌ద‌మ్ములు మృతి

image

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని బలీదుపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానిక చెక్ డ్యాం వద్ద చేపల వేటకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన సుధాకర్, సాయిలు అనే అన్నదమ్ములు నీటిలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. ఇటీవలే తల్లి సంవత్సరీకానికి హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News October 11, 2025

వర్మ.. HYDకు రంజీ ‘తిలకం’ దిద్దు!

image

రంజీ ట్రోఫీ.. దేశంలో 90 సార్లు జరిగిన క్రికెట్ సంగ్రామం. ఈ దేశవాలీ క్రికెట్‌లో HYD జట్టు కేవలం 2 టైటిళ్లు మాత్రమే గెలిచింది. మరో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. నాలుగు దశబ్దాలుగా రంజీ ట్రోఫీని HYD కైవసం చేసుకోలేకపోయింది. OCT 15 నుంచి 2025-26 సీజన్ ప్రారంభంకానుంది. ఈసారి హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ ఉండడంతో అభిమానుల్లో హోప్స్ పెరిగాయి. ఈ సీజన్‌లోనైనా <<17955623>>విజయ తిలకం<<>> దిద్దాలని ఫ్యాన్స్ కోరిక.