News October 11, 2025
రాయదుర్గం పేరు చరిత్ర తెలుసా?

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పేరు చారిత్రక నేపథ్యంతో ప్రసిద్ధి చెందింది. ‘రాయల దుర్గం’ అంటే రాజుల కోట అనే అర్థంతో ఈ పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన పాలకులు నిర్మించిన రాయదుర్గ కోట చుట్టూ పట్టణం అభివృద్ధి చెందింది. కాలక్రమంలో రాయలదుర్గం రాయదుర్గంగా మారిందట. జీవితమంతా రచనా వ్యాసంగంలో తరించిన సాహితీమూర్తి దివంగత జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఇక్కడే జన్మించారు.
Similar News
News October 11, 2025
కాశీ సందర్శనకు తరలి వస్తున్న విదేశీయులు

పరమ పవిత్ర కాశీ నగరానికి విదేశీ భక్తులు తరలివస్తున్నారు. 2021లో కేవలం 2,566 మంది విదేశీయులు మాత్రమే కాశీని సందర్శించారు. ఆ సంఖ్య 2024 నాటికి 2.1 లక్షలకు పెరిగింది. 2025 జూన్ నెలలోనే 1.88 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది పురాతన ఆలయాల గొప్పదనం విశ్వ నలుమూలలకు విస్తరిస్తోందని చెప్పడానికి సంకేతం. విదేశీయులు సైతం కాశీకి రావడం భారత ఆధ్యాత్మిక వారసత్వ విజయానికి నిదర్శనం!
News October 11, 2025
‘వాడపల్లి ఎస్సైపై చర్యలు’ కథనం అవాస్తవం: ఎస్పీ

వాడపల్లి ఎస్సై, కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినట్లుగా ప్రచురించిన వార్తల్లో వాస్తవం లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేస్తే, సంబంధిత వ్యక్తులు, పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అవాస్తవ కథనాలు ప్రచురించడం తగదని సూచించారు.
News October 11, 2025
ట్రంప్ది ఉరకలేసే హృదయం

అమెరికా అధ్యక్షులుగా ఎన్నికైన అత్యంత వృద్ధుల్లో డొనాల్డ్ ట్రంప్ ఒకరు. రెండోసారి బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన వయసు 79 ఏళ్లు. కానీ ఆయన హృదయం మాత్రం 14 ఏళ్ల చిన్నదేనట. ట్రంప్ వైద్య పరీక్షల నివేదికను వైట్హౌస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ విడుదల చేశారు. ఆయన గుండె, శరీరం వాస్తవ వయసుకన్నా తక్కువ ఉన్నట్లు డాక్టర్ల పరీక్షల్లో తేలిందన్నారు. ఊపిరితిత్తులు, నాడులు, ఇతర అవయవాల పనితీరు అద్భుతంగా ఉన్నట్లు చెప్పారు.