News October 11, 2025
TU: ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తగా ఆచార్య అపర్ణ

తెలంగాణ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం సమన్వయకర్తగా ఆచార్య అపర్ణను టీయూ వీసీ ప్రొఫెసర్ యాదగిరి రావు నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఆమెకు నియామక పత్రం అందజేశారు. టీయూ పరిధిలోని అన్ని కళాశాలల్లో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఆమె పలు అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ పదవులను నిర్వర్తించారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్తగా నియమించడం పట్ల వీసీ, రిజిస్ట్రార్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 11, 2025
తిరుపతి: మురికి కాలువలో 6 నెలల చిన్నారి

తిరుపతి సింగాలగుంట మసీదు వీధిలో శనివారం విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 6 నెలల చిన్నారిని మురికి కాలువలో స్థానికులు గుర్తించారు. వెంటనే సానిటరీ సిబ్బందికి అలాగే వీఆర్వోకి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని చిన్నారిని బయటికి తీశారు. అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా.. కేసు నమోదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 11, 2025
చేపల వినియోగం పెంపునకు ప్రాధాన్యం: మంత్రి టీజీ భరత్

చేపల వినియోగం పెంచేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. శనివారం నన్నూరు టోల్గేట్ వద్ద పాణ్యం ఎమ్మెల్యే చరిత, కలెక్టర్ డా.ఏ.సిరితో కలిసి చేపల విలువ ఆధారిత యూనిట్ను ప్రారంభించారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమని ఆయన చెప్పారు. రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో 60శాతం సబ్సిడీ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.
News October 11, 2025
మద్యం కేసు నిందితులందర్నీ అరెస్టు చేస్తాం: మంత్రి కొల్లు

ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించామని, వారిలో 14 మందిని అరెస్టు చేశామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏ1గా ఉన్న జనార్దనావును కస్టడీలోకి తీసుకున్నామని, నాలుగు ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరుతోపాటు ఏపీలోనూ దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. త్వరలో APTATS యాప్ ద్వారా మద్యం బాటిళ్ల వివరాలు తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.


