News April 7, 2024

సికింద్రాబాద్‌లో నేనే గెలుస్తా: కిషన్ రెడ్డి

image

లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజారిటీతో బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం HYD బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయంలో ఎన్నికల ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ అధ్యక్షతన సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ప్రజలంతా బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

Similar News

News September 10, 2025

HYD: ‘తొలి భూ పోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ’

image

తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత చాకలి ఐలమ్మ అని HYD జిల్లా అదనపు కలెక్టర్ కదిరవన్ పళని అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని నాంపల్లిలోని కలెక్టరేట్‌లో BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ పళని, DRO వెంకటచారితో కలిసి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

News September 10, 2025

HYD: కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి జాతర: మంత్రి

image

జూబ్లీహిల్స్‌లో BRS గెలిచినా లాభం లేదని, ప్రభుత్వం మారదని, ఓటర్లంతా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు HYDలో KTR వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి జాతర సాధ్యమని, BRSఎన్నికల్లో బీరు-బిర్యానీ సంస్కృతి తెచ్చిందన్నారు. జూబ్లిహిల్స్‌లో చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటిని కూల్చింది KTR కాదా అని ప్రశ్నించారు. పదేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు.

News September 10, 2025

HYD: ఫేక్ న్యూస్ ప్రచారంపై లీగల్ నోటీసులు పంపిస్తా: కార్తీక్ రెడ్డి

image

ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి చేరుతున్నట్లు వార్తలు రాస్తున్న మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచురించే వార్తా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లకు లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు.