News October 11, 2025
రాముడిపై భక్తితో 1,338KM నడిచిన భక్తుడు

రాముడిపై అనంతమైన భక్తితో గుజరాత్కి చెందిన 73 ఏళ్ల వృద్ధుడు లాల్ హర్జీవన్ దాస్ పటేల్ 1,338 కిలోమీటర్లు నడిచారు. భవ్య రామమందిర దర్శనం సంకల్పంగా ఆగస్టు 30న పాదయాత్ర ప్రారంభించి ప్రతిరోజు 35KM నడిచారు. మొత్తం 1,338KMను 40 రోజుల్లో పూర్తి చేసి, అయోధ్య చేరుకున్నారు. చిన్ననాటి కోరిక నెరవేరడం, రాముడిని దర్శించుకోవడం తన జన్మ ధన్యమైందని తెలిపారు. గతంలో 1990లో అద్వానీ రథయాత్రలోనూ ఆయన పాల్గొన్నారు.
Similar News
News October 11, 2025
తాజా న్యూస్ రౌండప్

✒ ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్ దంపతులు
✒ AP: నెల్లూరు జిల్లా మైపాడు గేటులో స్మార్ట్ స్ట్రీట్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
✒ చిత్తూరు నకిలీ మద్యం తయారీ.. నిందితులకు సీఎం, మంత్రి లోకేశ్తో సంబంధాలు: మాజీ మంత్రి కాకాణి
✒ వరంగల్ టెక్స్ టైల్ పార్కులో టీషర్టుల ఉత్పత్తిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం
✒ హెల్మెట్ ధరించి బైక్ డ్రైవ్ చేయాలన్న సాయి తేజ్.. ఆటో ఎక్స్పో 2015లో మెరిసిన మెగా హీరో
News October 11, 2025
ఏపీకి ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

AP: ప్రధాని మోదీ ఈనెల 16న 7.50AMకు ఢిల్లీ నుంచి బయల్దేరి 10.20AMకు కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 11.10AMకు రోడ్డుమార్గం ద్వారా శ్రీశైలం వెళ్లి 11.45AMకు మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. 2.30PMకు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్కు శంకుస్థాపన చేస్తారు. 4PMకు బహిరంగ సభలో పాల్గొంటారు. 4.40PMకు కర్నూలు ఎయిర్పోర్ట్కు వెళ్తారు. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.
News October 11, 2025
విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు

AP: విజయవాడ, సింగపూర్ మధ్య నవంబర్ 15 నుంచి ఇండిగో సంస్థ విమాన సర్వీసులను ప్రారంభించనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని వారాల్లో) సర్వీసులు ఉంటాయని వివరించారు. విజయవాడ నుంచి సింగపూర్ ఛాంగీ విమానాశ్రయానికి ఈ సర్వీసులు ఉంటాయని చెప్పారు. భవిష్యత్తులో కోటికి పైగా ప్రవాసాంధ్రులు ప్రయాణించే అవకాశం ఉందన్నారు.