News October 11, 2025
HYD: జిల్లా అధ్యక్షుల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు..!

రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షుల భర్తీకి తెలంగాణ ప్రదేశం కాంగ్రెస్ కమిటీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇవాళ్టి నుంచి డీసీసీ అధ్యక్ష పదవులకు దరఖాస్తులను అధిష్ఠాన పెద్దలు స్వీకరించనున్నారు. వారం రోజులపాటు ఏఐసీసీ పరిశీలకులు పరిశీలించనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జిల్లా అధ్యక్షులను బలమైన నేతలు పెట్టేందుకు ఏఐసీసీ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంది.
Similar News
News October 12, 2025
HYD: మటన్ గ్రాముకు @ రూపాయి..!

నగరంతో సహా శివారులో మటన్ ధరలు ఆకాశాన్నంటాయి. ఒకప్పుడు ఆదివారపు విందుగా ఉన్న మటన్ ఇప్పుడు విలాస వంటకంగా మారింది. నెల రోజులుగా కిలో మటన్ ధర రూ.1000గా కొనసాగుతోంది. మేకలు, గొర్రెల కొరత, రవాణా వ్యయాలు అధికమవ్వడంతో ధరలు పెరుగుతున్నాయని దుకాణదారులు చెబుతున్నారు. ఇంత ఖరీదైనప్పటికీ గసగసాలు వేసి గుమగుమలాడే యాట కర్రీ వండటానికి ప్రజలు వెనుకాడటం లేదు. దుకాణాల వద్ద భారీగా క్యూ ఉంటోంది. మీ ప్రాంతంలో ధర ఎంతుంది?
News October 12, 2025
HYD: రెండు రోజులు నీటి సరఫరా బంద్

కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్-3 పంపింగ్కు సంబంధించి భారీ లీకేజీకి మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుందని జలమండలి అధికారులు తెలిపారు. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, వనస్థలిపురం, ఉప్పల్, రాంపల్లి, బోడుప్పల్, సరూర్నగర్, బండ్లగూడ, ఉప్పల్, శంషాబాద్, నాగోల్ ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
News October 12, 2025
HYD: ఓటర్ స్లిప్ ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు: కర్ణన్

ఈనెల 22 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రారంభించి నవంబర్ 5 వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు HYD ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. శనివారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఓటరు స్లిప్పుల పంపిణీ చాలా ముఖ్యమని, ఓటరు స్లిప్ ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు.