News October 11, 2025
గ్రేటర్ HYDలో 14,112 గుంతలు పూడ్చి వేసినట్లు ప్రకటన

గ్రేటర్ HYD వ్యాప్తంగా 16,541 గుంతలు ఉన్నాయని గుర్తించిన అధికారులు, ఇప్పటి వరకు రోడ్లపై 14,112 గుంతలు పూడ్చివేసినట్లుగా తెలిపారు. రోడ్డు సేఫ్టీ చర్యలు వేగంగా చేపడుతున్నట్లు GHMC వివరించింది. జోన్ల వారీగా ఎల్.బీ. నగర్ జోన్ 2,743, చార్మినార్ జోన్ 2,235, ఖైరతాబాద్ 1,987, శేరిలింగంపల్లి 1,576, కూకట్పల్లి 2,308, సికింద్రాబాద్ జోన్లో 3,263 గుంతలు పూడ్చినట్లు రిపోర్ట్ను విడుదల చేసింది.
Similar News
News October 12, 2025
CP సజ్జనార్తో మెగాస్టార్ చిరంజీవి

నగరానికి నూతన CPగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ను ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమిషనరేట్లో CPతో భేటీ అయ్యారు. ఇరువురి మీటింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
News October 11, 2025
జూబ్లీహిల్స్ ఎన్నిక ఎఫెక్ట్: తాత్కాలికంగా ప్రజావాణి రద్దు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల13న విడుదల కానున్నదని, నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఫలితాలు ఉన్నందున ఫలితాల తదుపరి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని, జిల్లా ప్రజలు గమనించవలసిందిగా కోరారు.
News October 11, 2025
ఉస్మానియాలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం!

ఉస్మానియా ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. బ్రాట్ డెడ్, అడ్మిట్ డెడ్ కేసులను మెడికల్ రికార్డు అధికారులు వెంటనే రికార్డు చేయకపోవడంతో సర్టిఫికెట్ పొందటానికి ఆలస్యం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కోసారి నెలల సమయం పడుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆస్పత్రి కడుతోన్న ప్రభుత్వం ఇటువంటి సమస్యలపై ఫోకస్ చేయాలని కోరారు.