News October 11, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నిరుద్యోగుల సంచలన ప్రకటన

image

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నిరుద్యోగులు సంచలన ప్రకటన చేశారు. బైపోల్‌లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా 30లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసిందని పేర్కొన్నారు. ఈక్రమంలో జీపీఓ, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, డీఎస్సీ, గ్రూప్ 1,2,3,4 నోటిఫికేషన్ల కోసం పోరాడుతున్న దాదాపు 30 మంది నిరుద్యోగులు ఎన్నికల బరిలో ఉంటారన్నారు.

Similar News

News October 12, 2025

CP సజ్జనార్‌తో మెగాస్టార్ చిరంజీవి

image

నగరానికి నూతన CPగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌ను ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో CPతో భేటీ అయ్యారు. ఇరువురి మీటింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

News October 11, 2025

జూబ్లీహిల్స్ ఎన్నిక ఎఫెక్ట్: తాత్కాలికంగా ప్రజావాణి రద్దు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల13న విడుదల కానున్నదని, నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఫలితాలు ఉన్నందున ఫలితాల తదుపరి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని, జిల్లా ప్రజలు గమనించవలసిందిగా కోరారు.

News October 11, 2025

ఉస్మానియాలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం!

image

ఉస్మానియా ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. బ్రాట్ డెడ్, అడ్మిట్ డెడ్ కేసులను మెడికల్ రికార్డు అధికారులు వెంటనే రికార్డు చేయకపోవడంతో సర్టిఫికెట్ పొందటానికి ఆలస్యం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కోసారి నెలల సమయం పడుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆస్పత్రి కడుతోన్న ప్రభుత్వం ఇటువంటి సమస్యలపై ఫోకస్ చేయాలని కోరారు.