News October 11, 2025
విజయవాడ: నూతన డాగ్ కెనాల్స్ ప్రారంభం

పోలీసు కమిషనరేట్ పరిధిలో VIP భద్రత, నార్కోటిక్స్, నేర పరిశోధనల కోసం శిక్షణ పొందిన డాగ్లను ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మించిన డాగ్ కెనెల్స్ను పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. శిక్షణ పొందిన డాగ్లు స్వాగతం పలికి, మెళుకువలు ప్రదర్శించాయి. డీసీపీలు కె.జి.వి. సరిత, కె. తిరుమలేశ్వర రెడ్డి, ఏ.బి.టి.ఎస్. ఉదయ రాణి, ఇతర అధికారులు హాజరయ్యారు.
Similar News
News October 12, 2025
రాహుల్ మాదిరే తేజస్వీ ఓడిపోతారు: PK

అమేఠిలో గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓడినట్లే RJD నేత తేజస్వీ యాదవ్ రాఘోపుర్లో పరాజయం చెందుతారని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. ఆ నియోజకవర్గంలో కుటుంబ ఆధిపత్యాన్ని ఓటర్లు ఒప్పుకోవట్లేదని విమర్శించారు. తేజస్వీ కుటుంబం ఇక్కడి నుంచి ఎన్నికవుతున్నా కనీస సౌకర్యాలు కరవయ్యాయని ఆరోపించారు. అటు ఎన్నికల్లో తన పోటీపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
News October 12, 2025
సచివాలయం: వీధి కుక్కలను పట్టుకున్న అధికారులు

తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో వీధి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. సచివాలయం ప్రాంగణంలోని మీడియా పాయింట్, క్యాంటీన్, విజిటర్స్ లాంగ్లో తిరుగుతున్న కుక్కలను అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, సందర్శకులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
News October 12, 2025
VKB: బాలికలు.. క్రీడల్లో మహారాణులు

వికారాబాద్ జిల్లా పుట్టపాడు హై స్కూల్కి చెందిన బాలికలు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన బాలికలు కబడ్డీ అండర్-14 బాలికల విభాగంలో పరిగి జోన్లో విజేతగా నిలిచారు. వసుధా రెడ్డి, మదిహా ఫాతిమా, అక్షిత జిల్లాస్థాయిలో రాణించి, ప్రతిభ చాటారు. PD ప్రణవి ప్రోత్సాహంతో విద్యార్థులు అన్ని క్రీడల్లో రాణిస్తున్నారు. నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా.. Way2News ప్రత్యేక కథనం.