News October 11, 2025

HYD: నేరగాళ్ల చేతిలో చదువుకున్నోళ్లే మోసపోతున్నారు!

image

సైబర్ మోసాల్లో చదువుకున్నవారే అత్యధికంగా మోసపోతున్న పరిస్థితి ఉందని NCRB తెలిపింది. సైబర్ మోసాల్లో 60 శాతం మంది ఐటీ ఉద్యోగులు, నిపుణులు బాధితులుగా ఉంటున్నారు. మరోవైపు 30 శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు, 10% మంది ఇతరులు ఉన్నట్లుగా గుణాంకాలు చెబుతున్నాయి. NCRB గుణాంకాల ప్రకారం HYD లాంటి నగరాల్లో ఈ పరిస్థితి ఉందని తెలిపింది.

Similar News

News October 12, 2025

రాహుల్ మాదిరే తేజస్వీ ఓడిపోతారు: PK

image

అమేఠిలో గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓడినట్లే RJD నేత తేజస్వీ యాదవ్ రాఘోపుర్‌లో పరాజయం చెందుతారని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. ఆ నియోజకవర్గంలో కుటుంబ ఆధిపత్యాన్ని ఓటర్లు ఒప్పుకోవట్లేదని విమర్శించారు. తేజస్వీ కుటుంబం ఇక్కడి నుంచి ఎన్నికవుతున్నా కనీస సౌకర్యాలు కరవయ్యాయని ఆరోపించారు. అటు ఎన్నికల్లో తన పోటీపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.

News October 12, 2025

సచివాలయం: వీధి కుక్కలను పట్టుకున్న అధికారులు

image

తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో వీధి కుక్కలు హల్చల్ చేస్తున్నాయి. ఈ ఘటనపై అధికారులు స్పందించారు. సచివాలయం ప్రాంగణంలోని మీడియా పాయింట్, క్యాంటీన్, విజిటర్స్ లాంగ్‌లో తిరుగుతున్న కుక్కలను అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, సందర్శకులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

News October 12, 2025

VKB: బాలికలు.. క్రీడల్లో మహారాణులు

image

వికారాబాద్ జిల్లా పుట్టపాడు హై స్కూల్‌కి చెందిన బాలికలు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన బాలికలు కబడ్డీ అండర్-14 బాలికల విభాగంలో పరిగి జోన్‌లో విజేతగా నిలిచారు. వసుధా రెడ్డి, మదిహా ఫాతిమా, అక్షిత జిల్లాస్థాయిలో రాణించి, ప్రతిభ చాటారు. PD ప్రణవి ప్రోత్సాహంతో విద్యార్థులు అన్ని క్రీడల్లో రాణిస్తున్నారు. నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా.. Way2News ప్రత్యేక కథనం.