News October 11, 2025
కిశోరి బాలికల కోసం “కిశోరి వికాసం 2.0..!

బాపట్ల జిల్లాలో కిశోరి బాలికల కోసం “కిశోరి వికాసం 2.0” ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లాలో కిశోరి బాలికల పూర్తి సాధికారత కోసం నాణ్యమైన విద్య, సంపూర్ణ ఆహార ఆరోగ్యం, లింగ సమానత్వం, నైపుణ్యాభివృద్ధి, బాల్య వివాహాలను అరికట్టుట, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, మానవ అక్రమ రవాణా, ఆత్మ రక్షణ వంటి 12 కీలక అంశాల్లో అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News October 12, 2025
‘PM మీరు చాలా గ్రేట్’.. మోదీకి ట్రంప్ మెసేజ్

అమెరికా రాయబారి సెర్గియో గోర్ PM మోదీని కలిశారు. ఆ సమయంలో మోదీ, US అధ్యక్షుడు ట్రంప్ కలిసున్న ఫొటోను బహూకరించారు. దానిపై ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మీరు చాలా గ్రేట్’ అని రాసిన ఒక స్పెషల్ నోట్ ఉంది. అలాగే సెర్గియో కూడా భేటీ అనంతరం ట్రంప్కు PM మోదీ ‘గ్రేట్ పర్సనల్ ఫ్రెండ్’ అని పేర్కొన్నారు. ఆయన విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశీ కార్యదర్శి మిస్రీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్నూ కలిశారు.
News October 12, 2025
NLG: మద్యం దుకాణాలకు 163 దరఖాస్తులు

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు శనివారం మరో 67 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 163 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. .
News October 12, 2025
ఏటూరునాగారం: శిథిలావస్థకు చేరిన రేషన్ సేల్స్ భవనం

ఏటూరునాగారం మండలం దొడ్ల కొత్తూరులో ఏర్పాటు చేసిన డీఆర్ సేల్స్ డిపో శిథిలావస్థకు చేరింది. గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్(ఐఏపీ) నిధులతో గతంలో రేషన్ సరఫరా కోసం భవనాన్ని నిర్మించారు. కాలక్రమేపి భవనం శిథిలావస్థకు చేరడంతో పాటు ప్రధాన ద్వారం షట్టర్ విరిగిపోయింది. దొంగలు, పశువులు భవనంలోకి వెళ్లకుండా నిర్వాహకులు కర్రలను ఏర్పాటు చేశారు. మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.