News October 11, 2025

సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ADB SP

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సూచించారు. డబ్బుపై అత్యాశతో, ఉద్యోగంపై ఆసక్తితో లేదా తక్కువ సమయంలో లోను వస్తుందని సైబర్ నేరగాళ్ల చేతిలో ప్రజలు మోసపోతున్నారని వివరించారు. ఆర్థిక నేరం, సోషల్ మీడియా నేరం, యూపీఐ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్ వంటి మోసాలకు గురైతే వెంటనే 1930కి సంప్రదించాలన్నారు. ఈ వారం జిల్లాలో 11 సైబర్ ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు.

Similar News

News October 11, 2025

రైతులను ఆర్థిక పరిపుష్టి చేయడమే లక్ష్యం: గోడం నగేశ్

image

రైతులను ఆర్థిక పరిపుష్టి చేయడమే ప్రధాని లక్ష్యం ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. శనివారం ఆదిలాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి పాల్గొన్నారు. అన్నీ రాష్ట్రాల్లో పంట ఉత్పత్తులు, వ్యవసాయం, డెయిరీ, ఫిషరిష్ రంగాలను ప్రోత్సహించడానికి రూ.42 వేల కోట్లతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించిందని వెల్లడించారు.

News October 11, 2025

ప్రధాని నోట.. ఆదిలాబాద్ లడ్డూల గొప్పతనం

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ఆదిలాబాద్ మహువా లడ్డూల గురించి ప్రస్తావించడం ద్వారా రోజువారీ అమ్మకాలు 7 నుంచి 60 కిలోలకు పెరిగాయని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. నెలకు 2,000 కిలోల లడ్డూలు అమ్ముడవుతున్నాయని, అవి ‘ఆదివాసీ ఆహారం’ పథకంలో భాగంగా 60 హాస్టళ్లకు చేరుతున్నాయన్నారు. ఈ లడ్డూలు ఆదివాసీ మహిళలకు నిలకడైన ఆదాయం, గౌరవాన్ని అందిస్తున్నాయని తెలిపారు.

News October 11, 2025

రౌడీ షీటర్ల ప్రవర్తనను పరిశీలించాలి: ADB SP

image

రౌడీ షీటర్ల, సస్పెక్ట్ షీటర్ల ప్రవర్తనను ప్రతివారం పరిశీలించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీసులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గన్ లైసెన్సులపై శుక్రవారం సమీక్ష సమావేశంలో మాట్లాడారు. శాంతి భద్రతలకు ఇబ్బందులు కలిగించే వారి వివరాలు తీసుకొని బైండోవర్ చేయాలన్నారు. సన్మార్గంలో ఉన్న, ప్రవర్తన మార్చుకున్న రౌడీలపై రౌడీ షీట్ ఎత్తివేయాలని సూచించారు. నేర పరిశోధనలో మరింత అప్రమత్తతో ఉండాలన్నారు.