News October 11, 2025
అల్లూరి: ‘క్లాప్ కార్మికులకు రక్షణ పరికరాలు అందజేయాలి’

అల్లూరి జిల్లాలోని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికులకు రక్షణ వస్తువులు మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకట్ కోరారు. మారేడుమిల్లిలో క్లాప్ కార్మికుల సమస్యలను శనివారం ఆయన అడిగి తెలుసుకున్నారు. బూట్లు, గ్లౌజ్లు, యూనిఫామ్, మాస్క్లు ప్రభుత్వం ఇవ్వలన్నారు. కనీస వేతనం రూ. 12,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. చాలి చాలి వేతనాలతో కార్మికులను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు.
Similar News
News October 12, 2025
2027 వరల్డ్ కప్ ఆడాలని ఉంది: జడేజా

తనను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపిక చేయకపోవడంపై ముందే చర్చించారని టీమ్ ఇండియా ఆల్రౌండర్ జడేజా పేర్కొన్నారు. ‘నా సెలక్షన్పై మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్, సెలక్టర్లు డెసిషన్ తీసుకున్నారు. కారణాలేంటో నాకు చెప్పారు. 2027 WCకంటే ముందు కొన్ని వన్డేలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడల్లా పర్ఫార్మ్ చేసి వరల్డ్ కప్ టీమ్లో ప్లేస్ సాధించే ప్రయత్నం చేస్తా. ప్రపంచ కప్ కలను నిజం చేసుకుంటాను’ అని తెలిపారు.
News October 12, 2025
కొత్తగూడ: వెంటనే స్పందించిన ఎస్సై

కొత్తగూడ మండలం ఎంచగూడెంలో ఇద్దరు చిన్నారులు బావిలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, చిన్నారుల ప్రమాద విషయం తెలుసుకొని స్థానిక SI రాజ్ కుమార్ వెంటనే స్పందించారు. ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారులు బావిలో పడిపోయారని తెలుసుకొని వారి ఆచూకీ కోసం మానవత్వంతో స్పందించి వెను వెంటనే గ్రామస్థుల సహకారంతో మృత దేహలను బయటకు తీసుకువచ్చారు. దీంతో మండల ప్రజలు SIని అభినందిస్తున్నారు.
News October 12, 2025
జో బైడెన్కు రేడియేషన్ థెరపీ

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ 82 ఏళ్ల వయసులో ప్రోస్టేట్ క్యాన్సర్తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు ప్రస్తుతం వైద్యులు రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ‘జో బైడెన్ అగ్రెసివ్ ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. అది ఆయన ఎముకలకు పూర్తిగా పాకింది’ అని ఈ ఏడాది మే నెలలో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.