News October 11, 2025

దొంగ ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది: తుమ్మల

image

దేశంలో గత ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. దొంగ ఓట్లతోనే మోదీ, అమిత్ షా బృందం అధికారంలోకి వచ్చిందన్నారు. శనివారం ఖమ్మం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓట్ చోరీ సంతకాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్నారని, కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

Similar News

News October 12, 2025

ఫేక్ ఫొటోలపై పవన్ హీరోయిన్ ఫైర్

image

తన ఫేక్ ఫొటోలు వైరల్ చేయడంపై OG మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫైర్ అయ్యారు. ‘నన్ను తప్పుగా చిత్రీకరించిన కొన్ని AI జెనరేటెడ్ ఫొటోలు వైరలవుతున్నాయి. దయచేసి అలాంటివి షేర్ చేయడం, స్ప్రెడ్ చేయడం ఆపేయండి. టెక్నాలజీని కేవలం ఎథికల్ క్రియేటివిటీకి మాత్రమే వినియోగించాలి. ఏం క్రియేట్ చేస్తున్నాం? ఎలాంటివి షేర్ చేస్తున్నాం అనే విషయంలో మాత్రం అందరూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ట్వీట్ చేశారు.

News October 12, 2025

విదేశీ పర్యటనలకు ప్రభుత్వ టీచర్లు

image

TG: ప్రభుత్వ టీచర్లు, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ కోసం ప్రభుత్వం అంతర్జాతీయ ఎక్స్‌పోజర్ సందర్శనలు, విద్యా మార్పిడి కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఏడాది OCT, NOVలో టీచర్స్ సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్‌ను సందర్శిస్తారు. జిల్లా నుంచి ముగ్గురు చొప్పున విదేశీ పర్యటనకు కలెక్టర్లు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. సుమారు 160మంది టీచర్స్‌ను 4 బ్యాచులుగా విదేశాలకు పంపుతారు.

News October 12, 2025

ఈనెల 14న బంద్: దుడుకు లక్ష్మీనారాయణ

image

బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈనెల 14న బంద్ పాటించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అన్నారు. నల్గొండలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ బంద్‌లో బడుగు బలహీన వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.