News October 11, 2025
బొత్సకు వైసీపీ నుంచే ప్రాణహాని: పల్లా

AP: వైసీపీ ఎమ్మెల్సీ <<17973709>>బొత్స<<>> సత్యనారాయణకు కూటమి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని TDP చీఫ్ పల్లా శ్రీనివాస్ అన్నారు. ఆయనకు సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉండొచ్చని కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని బొత్స చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మండలిలో బొత్స కొంత రాణించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే జగన్ నుంచి ప్రాణహాని ఉండొచ్చని పేర్కొన్నారు. బొత్స భద్రత కావాలని కోరితే CM నిర్ణయం తీసుకుంటారన్నారు.
Similar News
News October 12, 2025
ఫేక్ ఫొటోలపై పవన్ హీరోయిన్ ఫైర్

తన ఫేక్ ఫొటోలు వైరల్ చేయడంపై OG మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫైర్ అయ్యారు. ‘నన్ను తప్పుగా చిత్రీకరించిన కొన్ని AI జెనరేటెడ్ ఫొటోలు వైరలవుతున్నాయి. దయచేసి అలాంటివి షేర్ చేయడం, స్ప్రెడ్ చేయడం ఆపేయండి. టెక్నాలజీని కేవలం ఎథికల్ క్రియేటివిటీకి మాత్రమే వినియోగించాలి. ఏం క్రియేట్ చేస్తున్నాం? ఎలాంటివి షేర్ చేస్తున్నాం అనే విషయంలో మాత్రం అందరూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ట్వీట్ చేశారు.
News October 12, 2025
విదేశీ పర్యటనలకు ప్రభుత్వ టీచర్లు

TG: ప్రభుత్వ టీచర్లు, హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్ కోసం ప్రభుత్వం అంతర్జాతీయ ఎక్స్పోజర్ సందర్శనలు, విద్యా మార్పిడి కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఏడాది OCT, NOVలో టీచర్స్ సింగపూర్, ఫిన్లాండ్, వియత్నాం, జపాన్ను సందర్శిస్తారు. జిల్లా నుంచి ముగ్గురు చొప్పున విదేశీ పర్యటనకు కలెక్టర్లు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తారు. సుమారు 160మంది టీచర్స్ను 4 బ్యాచులుగా విదేశాలకు పంపుతారు.
News October 12, 2025
2027 వరల్డ్ కప్ ఆడాలని ఉంది: జడేజా

తనను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ఎంపిక చేయకపోవడంపై ముందే చర్చించారని టీమ్ ఇండియా ఆల్రౌండర్ జడేజా పేర్కొన్నారు. ‘నా సెలక్షన్పై మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్, సెలక్టర్లు డెసిషన్ తీసుకున్నారు. కారణాలేంటో నాకు చెప్పారు. 2027 WCకంటే ముందు కొన్ని వన్డేలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడల్లా పర్ఫార్మ్ చేసి వరల్డ్ కప్ టీమ్లో ప్లేస్ సాధించే ప్రయత్నం చేస్తా. ప్రపంచ కప్ కలను నిజం చేసుకుంటాను’ అని తెలిపారు.