News October 11, 2025

తిరుపతి: మురికి కాలువలో 6 నెలల చిన్నారి

image

తిరుపతి సింగాలగుంట మసీదు వీధిలో శనివారం విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 6 నెలల చిన్నారిని మురికి కాలువలో స్థానికులు గుర్తించారు. వెంటనే సానిటరీ సిబ్బందికి అలాగే వీఆర్వోకి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని చిన్నారిని బయటికి తీశారు. అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా.. కేసు నమోదు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 12, 2025

ప్రొద్దుటూరు: రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపికైన దియా సింహ

image

ప్రొద్దుటూరుకు చెందిన సింహా సేన్ రెడ్డి కుమార్తె దియా సింహ రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపికైంది. కడపలో శనివారం జరిగిన జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలలో విద్యార్థిని దియా సింహ బ్రాంజ్ మెడల్ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. త్వరలో విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో దియాసింహ పాల్గొనున్నట్లు కోచ్ నాగేశ్వరరావు తెలియజేశారు.

News October 12, 2025

సంగారెడ్డి: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ మేళా

image

కంది మండలం ఎద్దుమైలారం పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 2025-26కు సంబంధించి అర్హులైన ఐటీఐ అభ్యర్థులకు వివిధ ట్రెడ్‌లలో 304 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 17న జిల్లా కేంద్రంలోని ఐటీఐ సెంటర్‌లో నిర్వహించే జాబ్ మేళాకు జిల్లా పరిసర ప్రాంతాల విద్యార్థులు తమ సర్టిఫికేట్స్‌తో హజరై ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ డైరెక్టర్ అలోక్ ప్రసాద్ తెలిపారు.

News October 12, 2025

ఫేక్ ఫొటోలపై పవన్ హీరోయిన్ ఫైర్

image

తన ఫేక్ ఫొటోలు వైరల్ చేయడంపై OG మూవీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫైర్ అయ్యారు. ‘నన్ను తప్పుగా చిత్రీకరించిన కొన్ని AI జెనరేటెడ్ ఫొటోలు వైరలవుతున్నాయి. దయచేసి అలాంటివి షేర్ చేయడం, స్ప్రెడ్ చేయడం ఆపేయండి. టెక్నాలజీని కేవలం ఎథికల్ క్రియేటివిటీకి మాత్రమే వినియోగించాలి. ఏం క్రియేట్ చేస్తున్నాం? ఎలాంటివి షేర్ చేస్తున్నాం అనే విషయంలో మాత్రం అందరూ కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ట్వీట్ చేశారు.