News October 12, 2025
డయాబెటిస్ ఉందా? ఈ ఫ్రూట్స్ ట్రై చేయండి!

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కొన్నిరకాల పండ్లు తినొచ్చని, వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, జామపండు, ఆపిల్, ఆరెంజ్, కివీ, బొప్పాయి, ద్రాక్ష (కొద్ది మోతాదులో) మంచి ఆప్షన్లు అని అంటున్నారు. వీటిని జ్యూస్ చేసుకునే బదులు పండ్లుగా తింటేనే ఆరోగ్యానికి లాభం అని సూచిస్తున్నారు.
Share it
Similar News
News October 12, 2025
హిందువులపై దాడి అంటూ ఇండియా ఫేక్ న్యూస్: యూనస్

తమ దేశంలో హిందువులపై హింస జరుగుతోందన్న ఆరోపణలను బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ యూనస్ ఖండించారు. అవన్నీ ఇండియా సృష్టించిన ఫేక్ వార్తలని మండిపడ్డారు. ‘ప్రస్తుతం ఇండియా స్పెషాలిటీస్లో ఫేక్ న్యూస్ ఒకటి. సరిహద్దులు, ఇతర స్థానిక సమస్యల విషయంలో ఇరుగు పొరుగు మధ్య విభేదాలు సాధారణమే. వాటికి మతం రంగు పులమకూడదు’ అని చెప్పారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు.
News October 12, 2025
తెలంగాణ అప్డేట్స్

* కొండా దంపతులు, పొంగులేటి శ్రీనివాస్ వివాదంపై CM రేవంత్ సీరియస్.. మేడారం పనులు పూర్తి చేయాలని ఆదేశం
* జూబ్లీహిల్స్ BJP అభ్యర్థిగా దీపక్ రెడ్డి ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం
* యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం
* గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ భరత్పై చర్యలు తీసుకోవాలని ‘మా’ అధ్యక్షుడు విష్ణుకు MLC బల్మూరి వెంకట్ విజ్ఞప్తి
News October 12, 2025
‘స్థానిక’ ఎన్నికలు: రేపు సుప్రీంకోర్టుకు సర్కార్

TG: ‘స్థానిక’ ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెచ్చిన జీవో నం.9పై హైకోర్టు <<17958620>>స్టే<<>> విధించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు కోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున ఢిల్లీకి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిని పంపే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం. అటు PCC చీఫ్ మహేశ్ ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.