News October 12, 2025
తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

AP: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న 84,571 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
Similar News
News October 12, 2025
పాప్ స్టార్తో కెనడా మాజీ ప్రధాని డేటింగ్!

అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీతో కెనడా Ex PM జస్టిన్ ట్రూడో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. US కాలిఫోర్నియాలో ఓ బోటులో విహరిస్తుండగా పెర్రీని ట్రూడో కిస్ చేస్తున్న ఫొటో వైరల్ అవుతోంది. గత జులైలో డిన్నర్ డేట్ సందర్భంగా వీరు తొలిసారి కలిసి కనిపించారు. 2023లో భార్య సోఫీ నుంచి ట్రూడో విడిపోగా, నటుడు ఒర్లాండోతో నిశ్చితార్థాన్ని 2025 జూన్లో పెర్రీ రద్దు చేసుకున్నారు.
News October 12, 2025
58 మంది పాక్ సైనికులు హతం: తాలిబన్ ప్రతినిధి

అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఘర్షణల్లో పాక్ సైన్యంలో 58 మంది హతమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తెలిపారు. సరిహద్దు, గగనతల ఉల్లంఘనలకు దీటుగా బదులిచ్చినట్లు చెప్పారు. 25 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దని PAKను హెచ్చరించారు. పాక్ కాబూల్లోని ఓ మార్కెట్లో బాంబు దాడి చేసినట్లు ఆరోపించారు. దీనికి పాక్ ధ్రువీకరించాల్సి ఉంది.
News October 12, 2025
ప్రజల్లో ‘కల్తీ’ భయం!

దేశంలో కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ఇప్పటివరకు పాలు, మద్యం, నిత్యవసరాలు, మెడిసిన్ కల్తీ అవడం చూస్తోండగా తాజాగా <<17975023>>Colgate<<>> ఘటన కలవరపరుస్తోంది. పనీర్, ఈనో, సెన్సోడైన్ వంటివి కూడా కల్తీ అవడం ఈ మధ్యకాలంలో వెలుగుచూశాయి. రసాయనాలు, నాసిరకం పదార్థాలతో వీటి తయారీ ప్రాణాలపైకి తీసుకొస్తుంది. దీంతో ఏది కల్తీనో ఏదీ నిజమైనదో తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.