News October 12, 2025
విశాఖకు రైడెన్.. ₹22 వేల కోట్ల రాయితీలు!

AP: గూగుల్ అనుబంధ సంస్థ Raiden Infotech వైజాగ్లో రూ.87,520 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైడెన్కు భారీ సబ్సిడీలు ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. భూమి విలువపై 25% డిస్కౌంట్తో 480 ఎకరాలు, జీఎస్టీపై సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు, నీరు, విద్యుత్ వాడకంపై రాయితీతో సహా మొత్తంగా ₹22 వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
Similar News
News October 12, 2025
చిదంబరం మాటలు.. కాంగ్రెస్లో మంటలు!

కాంగ్రెస్ నేత చిదంబరం చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. 26/11 ముంబై దాడులకు ప్రతీకారంగా పాక్పై అటాక్ చేయకుండా అమెరికా ఒత్తిడి చేయడంతో వెనక్కి తగ్గినట్లు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సైనిక చర్య తప్పుడు మార్గమని తాజాగా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ, మోదీ లైన్లో చిదంబరం మాట్లాడుతున్నారని మండిపడింది.
News October 12, 2025
రెప్పపాటులో బీజేపీ పని పూర్తి చేస్తుంది: ఒవైసీ

BJP బలమైన రాజకీయ ప్రత్యర్థి అని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రోజుకు 24 గంటలూ పని చేస్తుందని చెప్పారు. ప్రతిపక్షాలు అప్రమత్తంగా ఉండాలని, రెప్పపాటులో BJP తన పని పూర్తిచేస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ఓట్ చోరీ ఆరోపణలను తోసిపుచ్చారు. 2009, 2014లోనే తన సెగ్మెంట్లో ఓటర్ లిస్టులో డూప్లికెట్ ఎంట్రీలను గుర్తించి, సవాల్ చేశానని చెప్పారు. ఓటర్ లిస్టు, పేర్లను పార్టీలు కచ్చితంగా తనిఖీ చేయాలన్నారు.
News October 12, 2025
నా కూతురికి రక్షణ లేదు.. రేప్ బాధితురాలి తండ్రి ఆందోళన

పశ్చిమ బెంగాల్లో తన కూతురి భద్రత గురించి ఆందోళనగా ఉందని <<17979948>>గ్యాంగ్రేప్<<>> బాధితురాలి తండ్రి వాపోయారు. ‘నా బిడ్డ ప్రస్తుతం నడవలేకపోతోంది. డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మమ్మల్ని ఒడిశాకు వెళ్లనివ్వండి. అక్కడే తను సురక్షితంగా ఉండగలదు’ అని చెప్పారు. కాగా ఫ్రెండ్తో కలిసి బయటకు వెళ్లిన మెడికల్ స్టూడెంట్పై ముగ్గురు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.