News October 12, 2025
తిరుమలలో పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లు నిండిపోయి భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు దాటిపోయింది. నిన్న 84,571 మంది స్వామివారిని దర్శించుకున్నారు. కానుకల రూపంలో ₹3.70 కోట్లు సమర్పించారు. 36,711 మంది తలనీలాలు అర్పించారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు దర్శనానికి 20 గంటలు పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారు కేటాయించిన సమయానికి మాత్రమే క్యూలోకి రావాలని టీటీడీ సూచించింది.
Similar News
News October 12, 2025
అర్ధరాత్రి అమ్మాయి ఎలా బయటికి వచ్చింది: మమత

MBBS స్టూడెంట్ గ్యాంగ్రేప్ ఘటనపై బెంగాల్ CM మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాలేజీ నుంచి అర్ధరాత్రి 12.30గం.కు అమ్మాయి ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించారు. రాత్రిపూట బయటకు రానివ్వకూడదని అన్నారు. అమ్మాయిలు తమను తాము రక్షించుకోవాలని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ‘మణిపుర్, బిహార్, UP, ఒడిశాలో ఇలాంటివి జరిగాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.
News October 12, 2025
ఉచితాలు కాదు.. భవిష్యత్ కావాలన్నారు: పవన్

AP: తిత్లీ తుఫాను సమయంలో శ్రీకాకుళం యువతను పరామర్శించానని, వాళ్లతో జరిగిన సంభాషణ గుర్తుందని Dy.CM పవన్ పేర్కొన్నారు. ‘వారు ఉచితాలు, సంక్షేమ పథకాలు అడగలేదు. 25 ఏళ్ల మంచి భవిష్యత్ కావాలన్నారు. నిత్యం యువతతో మాట్లాడుతూ ఉంటా. వారి కలలు నిజం చేసేందుకు కృషి చేస్తా’ అని పేర్కొన్నారు. 2018లో పవన్తో తన జర్నీ మొదలైందని మంత్రి మనోహర్ ఓ ఫోటోను ట్వీట్ చేయగా దానికి పవన్ పైవిధంగా స్పందించారు.
News October 12, 2025
చిదంబరం మాటలు.. కాంగ్రెస్లో మంటలు!

కాంగ్రెస్ నేత చిదంబరం చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. 26/11 ముంబై దాడులకు ప్రతీకారంగా పాక్పై అటాక్ చేయకుండా అమెరికా ఒత్తిడి చేయడంతో వెనక్కి తగ్గినట్లు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ సైనిక చర్య తప్పుడు మార్గమని తాజాగా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ, మోదీ లైన్లో చిదంబరం మాట్లాడుతున్నారని మండిపడింది.