News October 12, 2025

రాయవరం ఘటనలో పదికి చేరిన మృతుల సంఖ్య

image

రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఆదివారం ఉదయం అనపర్తికి చెందిన చిట్టూరి యామిని చికిత్స పొందుతూ మరణించగా, తాజాగా వేండ్ర గ్రామానికి చెందిన లింగం వెంకటకృష్ణ కూడా మృతి చెందారు. దీంతో ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పదికి చేరుకుంది. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.

Similar News

News October 12, 2025

ప్రధాని పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలి: CM

image

ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఎటువంటి లోపం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని CM చంద్రబాబు నాయుడు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆదివారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. కర్నూలు నుంచి స్పెషల్‌ ఆఫీసర్‌ వీర పాండేన్‌, జిల్లా కలెక్టర్‌ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు.

News October 12, 2025

HNK, WGL జిల్లాల్లో AICC అబ్జర్వర్ల పర్యటన షెడ్యూల్ ఇదే!

image

HNK, WGL జిల్లాల డీసీసీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ నేపథ్యంలో ఏఐసీసీ, PCC అబ్జర్వర్లు రేపటి నుంచి జిల్లాలోని పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 13న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, 14న పరకాల, 16న వరంగల్ తూర్పు, 17న వర్ధన్నపేట, 18న నర్సంపేట నియోజకవర్గాల పార్టీ శ్రేణులతో అబ్జర్వర్లు సమావేశం నిర్వహించనున్నారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడి పీఠం ఎవరిని వరిస్తుందో చూడాల్సి ఉంది.!

News October 12, 2025

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!

image

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోనున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. అట్లీ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న AA22 కోసం ఆయన ఏకంగా రూ.175 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రభాస్ కొన్ని సినిమాలకు రూ.150 కోట్లు తీసుకున్నారని పేర్కొన్నాయి. దీంతో రాబోయే సినిమాలతో ఐకాన్ స్టార్ హాలీవుడ్ రేంజ్‌కు వెళ్తారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.