News October 12, 2025
విజయవాడ: దుర్గ గుడికి పోటెత్తిన భక్తులు

దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ, అమ్మవారి ఆలయంలో దసరా రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆదివారం కావడంతో దుర్గగుడి దేవస్థానంలో వేకువ జాము నుంచే భక్తుల రద్దీ పెరిగింది. ఈ రద్దీ దృష్టిలో ఉంచుకుని, ఘాట్ రోడ్డు నుంచి నడుచుకుంటూ వచ్చిన దేవస్థానం EO, సెక్యూరిటీ సిబ్బందికి పలు సూచనలు చేస్తూ, కార్ల ట్రాఫిక్పై అవగాహన కల్పించారు. అన్ని దర్శనం టికెట్లను రద్దు చేసి, భక్తులకు ఉచితంగా అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు.
Similar News
News October 12, 2025
నిర్మల్: మద్యం షాపుల రిజర్వేషన్లు ఖరారు

జిల్లాలో వైన్స్ షాపులకు అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. 47 మద్యం దుకాణాల్లో ఎస్టీ 1, గౌడ 3, ఎస్సీ 5 వైన్ షాపులు కేటాయించారు. ఎస్టీ -నర్సాపూర్ (జి)షాపు నెం.2, గౌడలకు – నిర్మల్ షాపు నెం.1, పెంబి, కుబీర్ షాపు నెం.1, ఎస్సీలకు – తానూర్, సొన్ షాపు నెం.2, సారంగాపూర్ షాపు నెం.1, కడెం షాపు నెం.1, భైంసా షాపు నెం.5 కేటాయించారు. ఆసక్తి గలవారు ఈ నెల 18లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 12, 2025
మెనోపాజ్ తర్వాత గుండె సమస్యలు

మహిళల్లో మెనోపాజ్ తర్వాత అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టెరాన్ పెరగడంతో గుండెసంబంధిత సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. గుండె ఆరోగ్యం కోసం రెగ్యులర్ హార్ట్ చెకప్స్, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. కొలెస్ట్రాల్, బీపీ, బ్లడ్లో గ్లూకోజ్లెవల్స్ చెక్ చేసుకోవాలి. ఫైబర్, నట్స్, పండ్లు, కూరగాయలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News October 12, 2025
వరంగల్ ఖిల్లాను మళ్లీ చూడటం సంతోషంగా ఉంది: సజ్జనార్

SMలో ఎప్పుడూ యాక్టివ్ ఉండే HYD పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. వరంగల్ ఖిల్లాను మరోసారి చూడటం ఎంత సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. 17 ఏళ్ల క్రితం తొలిసారి ఓరుగల్లు కోటను సందర్శించానని, దాన్ని రీ విజిట్ చేయడం ఇన్నాళ్లకు సాధ్యమైందన్నారు. ఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి సమయం కేటాయిస్తే ఆ ఆనందం వేరని పేర్కొన్నారు. తనతో ఖిల్లాను సందర్శించిన ఫొటోను షేర్ చేశారు.