News October 12, 2025
ఏపీ టాస్క్ ఫోర్స్ కి నాయకుడు వచ్చేనా..?

శేషాచలంలో లభించే విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా కోసం డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో RSASTF ను చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. 2014 నుంచి 2019 వరకు డీఐజీ నుంచి ఐజీకి పదోన్నతి పొందిన డాక్టర్ కాంతారావు విశేష సేవలు అందించారు. ఆయన బదిలీ అయిన తరువాత ఎస్పీ స్థాయి అధికారుతోనే టాస్క్ ఫోర్స్ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేయాలని పలువురు కోరుతున్నారు.
Similar News
News October 12, 2025
మేడారానికి పొంగులేటి.. నెలకొన్న ఆసక్తి!

మేడారం ఆలయ ప్రాంగణం ఆధునీకరణ పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని CM రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతర పనులపై సమీక్ష జరిపేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం మేడారం రానున్నారు. అయితే, తాజాగా మంత్రి కొండా సురేఖ తన శాఖలో పొంగులేటి పెత్తనం చేస్తున్నారంటూ అధిష్ఠానంకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పొంగులేటి రాకపై ఆసక్తి నెలకొంది. కాగా, 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది.
News October 12, 2025
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని ఆమె వెల్లడించారు. ప్రజలు 1100కు కాల్ చేసి కూడా సమస్యలు తెలియజేయవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News October 12, 2025
‘రంజీ’ తెచ్చిన హైదరాబాదీ!

సిటీలోనే పుట్టి, పెరిగారు ఆయన. క్రికెట్ అంటే ఆసక్తి. పుట్టిన గడ్డ పేరు నిలబెట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నారేమో మరి. దేశవాలీ క్రికెట్లో మన హైదరాబాద్ పేరును మారుమోగించారు. ఆయనే నవాబ్ సయ్యద్ మొహమ్మద్ హుస్సేన్. నిజాం కాలేజీలో చదివిన ఆయన క్రికెట్లో రాణించారు. ఆయన ప్రతిభతో రంజీ ట్రోఫీ ఛాంపియన్షిప్లో హైదరాబాద్కు సారథి అయ్యారు. ఈయన కెప్టెన్సీలోనే (1937-38) రంజీ 3వ టైటిల్ను HYD గెలిచింది.