News October 12, 2025
HYD: మహిళలూ మీకోసమే.. వేదిస్తే ఇలా చేయండి!

యువతులు, మహిళలు ఇబ్బందులు పడితే ఇలా ఫిర్యాదు చేయండి. గృహహింస, వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు, లింగ వివక్షత, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, అత్యాచారం, సైబర్ నేరాలు, అక్రమన రవాణా, బలవంత వ్యభిచారం వంటి వాటిపై ఫిర్యాదు చేయొచ్చు. మీకు అండగా ఉంటామని HYD ప్రోగ్రాంలో మహిళా కమిషన్ తెలిపింది. హెల్ప్ లైన్ 040 27542017, telanganastatewomencommission@gmail.com సంప్రదించండి.
Similar News
News October 12, 2025
మేడారానికి పొంగులేటి.. నెలకొన్న ఆసక్తి!

మేడారం ఆలయ ప్రాంగణం ఆధునీకరణ పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలని CM రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతర పనులపై సమీక్ష జరిపేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం మేడారం రానున్నారు. అయితే, తాజాగా మంత్రి కొండా సురేఖ తన శాఖలో పొంగులేటి పెత్తనం చేస్తున్నారంటూ అధిష్ఠానంకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పొంగులేటి రాకపై ఆసక్తి నెలకొంది. కాగా, 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుంది.
News October 12, 2025
యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని ఆమె వెల్లడించారు. ప్రజలు 1100కు కాల్ చేసి కూడా సమస్యలు తెలియజేయవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News October 12, 2025
‘రంజీ’ తెచ్చిన హైదరాబాదీ!

సిటీలోనే పుట్టి, పెరిగారు ఆయన. క్రికెట్ అంటే ఆసక్తి. పుట్టిన గడ్డ పేరు నిలబెట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నారేమో మరి. దేశవాలీ క్రికెట్లో మన హైదరాబాద్ పేరును మారుమోగించారు. ఆయనే నవాబ్ సయ్యద్ మొహమ్మద్ హుస్సేన్. నిజాం కాలేజీలో చదివిన ఆయన క్రికెట్లో రాణించారు. ఆయన ప్రతిభతో రంజీ ట్రోఫీ ఛాంపియన్షిప్లో హైదరాబాద్కు సారథి అయ్యారు. ఈయన కెప్టెన్సీలోనే (1937-38) రంజీ 3వ టైటిల్ను HYD గెలిచింది.