News October 12, 2025
గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పోటీల్లో జగిత్యాల యువకుల సత్తా..!

తమిళనాడు చెన్నైలో కరాటే మార్షల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ పోటీల్లో జగిత్యాల జిల్లా పెగడపల్లి యువకులు ప్రతిభ చాటారు. మండల కేంద్రానికి చెందిన క్యాస రాజశేఖర్, మండలంలోని నందగిరివాసి గాజుల రాకేశ్ కరాటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పోటీల్లో పాల్గొని మార్షల్ ఆర్ట్స్లో ప్రతిభ కనబర్చడంతో గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు.వీరిని పలువురు అభినందించారు.
Similar News
News October 12, 2025
సీఎం సహాయ నిధితో పేదలకు చేయూత: మంత్రి సీతక్క

సీఎం సహాయ నిధి ద్వారా పేదలకు చేయూతనిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ములుగు నియోజకవర్గానికి చెందిన 43 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.63 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఆదివారం అందజేశారు. ములుగులోని క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన పేదవారికి ఆర్థిక భారం తగ్గిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
News October 12, 2025
నిజామాబాద్: DCC పదవికి దరఖాస్తు చేసుకున్న వేణుగోపాల్ యాదవ్

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పీసీసీ అధికార ప్రతినిధి కమ్మర్పల్లికి చెందిన సీనియర్ నాయకుడు బాస వేణుగోపాల్ యాదవ్ దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ నిర్మాణ పటిష్టత కోసం నూతన అధ్యక్షుల నియామక ప్రక్రియ మొదలైన సంగతి తెలిసిందే. జిల్లా అబ్జర్వ్గా కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.
News October 12, 2025
ప్రధాని పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలి: CM

ప్రధాని నరేంద్ర మోదీ జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఎటువంటి లోపం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని CM చంద్రబాబు నాయుడు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆదివారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. కర్నూలు నుంచి స్పెషల్ ఆఫీసర్ వీర పాండేన్, జిల్లా కలెక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు.